బంగారం, వెండి ధరలు తగ్గాయి...

- October 24, 2016 , by Maagulf
బంగారం, వెండి ధరలు తగ్గాయి...

అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్‌ లేమితో బంగారం, వెండి ధరలు తగ్గాయి. నేటి బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల పసిడి రూ.105 తగ్గి రూ.30,145కు చేరింది. పండగ, పెళ్లి సీజన్‌ కారణంగా దేశీయ మార్కెట్లో కొనుగోళ్లు బాగానే ఉన్నాయి. ఇటీవల రూ.43వేల మార్కును చేరిన వెండి.. నేటి మార్కెట్లో రూ.43వేల దిగువకు తగ్గింది. కేజీ వెండి రూ.200తగ్గి రూ.42,800కు చేరింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి వెండికి డిమాండ్‌ తక్కువగా ఉందని మార్కెట్‌ వర్గాలు చెప్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర తగ్గింది. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.06శాతం తగ్గి 1,265డాలర్లుగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com