నవ్యాంధ్రప్రదేశ్ లో ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ...
- October 25, 2016
హైదరాబాద్లో ఉన్న సినీ పరిశ్రమ నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలిరావాలని నవ్యాంధ్రప్రదేశ్ ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షురాలు, సినీనటి కవిత పేర్కొన్నారు. బ్రాడీపేటలోని ఓ హోటల్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ హైదరాబాద్లో సోకాల్డ్ నిర్మాతలు సీనియర్ నటి నటులకు అవకాశం కల్పించకుండా పక్క రాష్ట్రాల నుంచి నటీ నటులతో చిత్రాలు నిర్మిస్తున్నారని విమర్శించారు. వైజాక్ ప్రాంతంలో స్టూడియోలు నిర్మిస్తామని స్థలాల కోసం వెతుకుతున్నారన్నారు. వారు సినీ పరిశ్రమను అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారని, అటువంటి వారికి ప్రభుత్వం స్థలాలు ఇవ్వరాదని సూచించారు.సినీ పరిశ్రమ అమరావతిలో ఉంటే స్థానిక, సీనియర్ నటులకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉండవన్నారు. నూతనంగా నవ్యాంధ్రప్రదేశ్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు పేరుతో సం స్థను ప్రారంభించినట్లు తెలిపారు. సమావేశంలో అధ్యక్షుడు ఎస్వీఎన్ రావు, కార్యదర్శి సాయిప్రసాద్, కోశాధికారి ఎస్వీ తిరుమలరావు, సభ్యులు విజయ భాస్కర్రెడ్డి, తోట కృష్ణ, కె.శ్రీనాథ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







