'బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవగాహన నడక'

- October 26, 2016 , by Maagulf
'బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవగాహన నడక'

 బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 'బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవగాహన నడక' నిర్వహించారు. బీఐఏసీహెచ్‌ అండ్‌ ఆర్‌ఐ ఛైర్మన్‌, సినీనటుడు నందమూరి బాలకృష్ణ, ఎంపీ కల్వకుంట్ల కవిత, సినీనటి మంచు లక్ష్మి జెండా వూపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేబీఆర్‌ పార్క్‌ నుంచి బసవతారకం ఇండో అమెరికన్‌ ఆసుపత్రి వరకు నడక నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. రొమ్ము క్యాన్సర్‌తో ప్రతి నిమిషానికి ఒక మహిళ చనిపోతున్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో రొమ్ముక్యాన్సర్‌పై సరైన అవగాహన లేదన్నారు.బసవతారకం ఆసుపత్రికి మాత్రమే మోనోగ్రఫీ మొబైల్‌ వాహనం సౌకర్యం ఉందని వెల్లడించారు. ఎంపీ కవిత మాట్లాడుతూ.. రొమ్మ క్యాన్సర్‌ రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. రొమ్ము క్యాన్సర్‌పై మరింత అవగాహన పెరగాల్సిన అవసరముందని పేర్కొన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com