'బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నడక'
- October 26, 2016
బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 'బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నడక' నిర్వహించారు. బీఐఏసీహెచ్ అండ్ ఆర్ఐ ఛైర్మన్, సినీనటుడు నందమూరి బాలకృష్ణ, ఎంపీ కల్వకుంట్ల కవిత, సినీనటి మంచు లక్ష్మి జెండా వూపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేబీఆర్ పార్క్ నుంచి బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రి వరకు నడక నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. రొమ్ము క్యాన్సర్తో ప్రతి నిమిషానికి ఒక మహిళ చనిపోతున్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో రొమ్ముక్యాన్సర్పై సరైన అవగాహన లేదన్నారు.బసవతారకం ఆసుపత్రికి మాత్రమే మోనోగ్రఫీ మొబైల్ వాహనం సౌకర్యం ఉందని వెల్లడించారు. ఎంపీ కవిత మాట్లాడుతూ.. రొమ్మ క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. రొమ్ము క్యాన్సర్పై మరింత అవగాహన పెరగాల్సిన అవసరముందని పేర్కొన్నారు
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







