'APNRT' సేవ‌ల‌ను కొనియాడిన భార‌త రాయ‌బారి

- October 26, 2016 , by Maagulf

విదేశాల్లోని ప్ర‌వాసాంధ్రుల‌కు అండ‌గా నిల‌బ‌డ‌టంతో పాటు మాతృభూమి అభివృద్ధిలో వారిని భాగ‌స్వాముల‌ను చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఏర్ప‌డ్డ ఏపీఎన్నార్టీ సేవ‌ల‌ను కువైట్‌లోని భార‌త రాయ‌బారి కొనియాడారు. ఏపీఎన్నార్టీఎస్ స‌భ్యులు కువైట్‌లోని భార‌త రాయ‌బారితో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌వాసాంధ్రుల‌కు ఏపీఎన్నార్టీ అందిస్తున్న సేవ‌ల గురించి వారు ఆయ‌న‌కు వివ‌రించారు. ఏపీఎన్నార్టీ కో-ఆర్డినేట‌ర్ల బాధ్య‌త‌లు, వారు ప్ర‌వాసాంధ్రుల‌కు అందిస్తున్న సేవ‌ల‌ను కూడా ప్ర‌స్తావించారు.

ఏపీఎన్నార్టీ సేవ‌ల‌ను ఆస‌క్తిగా ఆల‌కించిన ఆయ‌న… స‌ద‌రు సేవ‌ల‌ను బ్లూ కాల‌ర్ వ‌ర్క‌ర్ల‌కు కూడా అందేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. భార‌త రాయ‌బార కార్యాల‌యం నుంచి ఏపీఎన్నార్టీఎస్‌కు సంపూర్ణ స‌హ‌కారం అందిస్తాన‌ని కూడా ఆయ‌న హామీ ఇచ్చారు. భార‌త రాయ‌బారిని క‌లిసిన వారిలో ఏపీఎన్నార్టీ ప్ర‌తినిధులు సుబ్బ‌రాయుడు ముల‌క‌ల‌, బ‌ల‌రామ్ నాయుడు, వెంక‌ట్ కోడూరి, దివాక‌ర్ నాయుడు ఒలేటి, వెంక‌టేశ్ నాయుడు వేగి, పేర‌మ్ ర‌మ‌ణ‌, మాలేపాటి సురేశ్‌బాబు నాయుడు, మాలేపాటి వెంకటేశ్వ‌ర్లు, ఉద‌య్ ప్ర‌కాశ్, కేవీఎన్ ప్ర‌సాద్‌, పోల‌వ‌ర‌పు బాబునాయుడు, సాయి వెంక‌ట‌సుబ్బారావు, ఎద్సానీ బాషా, మ‌రాతు మ‌ల్లికార్జున‌, నాగేంద‌ర్ బాబు, ఫ‌ణి క్రిష్ణ‌, జ్యోత్స్న ముప్పాల త‌దిత‌రులు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com