తెలుగు రాష్ట్రాల్లో దీపావళికి తమిళ మూవీల సందడి...
- October 26, 2016
సినిమాలకు పండుగల సీజన్ అంటూ ప్రత్యేకంగా ఉంటుంది. సహజంగా పండుగలకు ప్రత్యేకంగా సెలవులు ఉంటాయి. అందరూ ఎంజాయ్ మూడ్లో ఉంటారు కాబట్టి కొత్త సినిమాలకు మంచి కలక్షన్లు వస్తాయి. ఈ ఉద్దేశంతో భారీ చిత్రాలను సీజన్ చూసి రిలీజ్ చేస్తుంటారు.
ఇది సంప్రదాయంగా వస్తున్నదే. సంక్రాంతితో ఈ హడావుడి మొదలై విజయదశమి వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత వచ్చేది దీపావళి. అయితే దీపావళికి మాత్రం టాలీవుడ్లో కొత్త సినిమాల సందడి ఉండదు. కోలివుడ్, బాలీవుడ్ మాత్రం ఈ సీజన్ను అపయోగిం చుకుంటాయి.
దీపావళికి మాత్రం తెలుగు సినిమాలను విడుదల చేసే సంప్రదాయం లేదు. దీపావళికి పక్షం రోజుల ముందే విజయదశమి వస్తుంది కాబట్టి కొత్త సినిమాలు విడుదలై థియేటర్లలో ఉంటాయి.
ఈ సారి దసరాకి కూడా ఐదు చిత్రాలు ప్రేక్షకుల ముందుకువచ్చాయి. వీటినే మనం దీపావళి సినిమాలని కూడా అనుకోవాలి. దీపావళి అమావాస్యలో వచ్చే వెలుగు పండగ. అందువల్ల ఆ రోజున సినిమాలు విడుదల చేయడానికి తెలుగు నిర్మాతలు ఇష్టపడరు. కొన్ని సార్లు మాత్రం సెంటిమెంట్ను పక్కనపెట్టేసి సినిమాలు రిలీజ్ చేసిన సందర్భాలున్నాయి. గత ఏడాది అక్కినేని అఖిల్ నటించగా వినాయక్ దర్శకత్వం వహించిన అఖిల్ సినిమా దీపావళికి విడుదలైంది. దీని ఫలితం ఏమిటో అందరికీ తెలిసిందే. వారం రోజుల ముందు కలర్స్ స్వాతి నటించిన త్రిపుర రిలీజైంది. దానికంటే ముందు ఏడాది అంటే 2014లో దీపావళికి వారం ముందు ఒక లైలా కోసం, వారం తర్వాత కార్తికేయ సినిమాలు రిలీజయ్యాయి. కారణం తెలియదు కానీ దీపావళికి రిలీజైన తెలుగు చిత్రాలు ప్రతికూల ఫలితాన్ని చూశాయి. అందుకే ఈసారి రెండు రాష్ట్రాల్లో తమిళ అనువాద సినిమాలే హల్చెల్ చేయనున్నాయి. కార్తి, నయనతార నటించిన కాష్మోరా, ధనుష్, త్రిష నటించిన ధర్మయోగి, విజయ్ ఆంథోని నటించిన సైతాన్ చిత్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతున్నాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
తమిళులకు దీపావలి పెద్ద పండుగ. మనకు సంక్రాంతిలాగా వారికి దీపావళి. గతంలో దీపావళికి కనీసం డజను సినిమాలను విడుదల చేసేవారు. కానీ క్రమంగా ఈ సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఈసారి కేవలం మూడు సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. చిత్రమేమంటే ఈ మూడు చిత్రాలే అనువాదమై తెలుగులో వస్తున్నాయి
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







