సమాజ సమస్యలు ప్రతిబింబించేలా పూరీ ...
- October 27, 2016
సినిమా వినోద సాధనమైనా. కొంతైనా సార్థకత ఉండాలన్నది విజ్ఞుల మాట. సార్థకత అంటే ప్రజలకో, సమాజానికో పనికొచ్చే ఓ మంచి మాట చెప్పడం. సంఘాన్ని మార్చేలా, సమాజ సమస్యలు ప్రతిబింబించేలా కథను చూపించడం. సినిమా వల్ల ఒక్కరు మారినా ఆ ప్రభావం కొన్నేళ్లలో పెద్ద మొత్తమే అవుతుంది. మంచి మార్పునకు బాటలు వేస్తుంది. ఇటీవల తన సినిమాలతో అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్.
పూరీ తొలినాళ్ల దర్శకత్వ ప్రయాణమంతా ఫాంటసీ కథల మీదే నటించింది. ఈ ప్రయాణంలో కొద్ది కొద్దిగా పరిపక్వత చెందాడు. 'బద్రి', 'బాచీ' సమయానికి తను ఎంచుకున్న కథలకు 'అమ్మా నాన్న తమిళ అమ్మయి', '143' లాంటి నేపథ్యాలకు భావోద్వేగాలు మోతాదు పెంచాడు.
ఈ ఆలోచననా విధానం మరింతగా మారుతూ వచ్చింది. మాఫియా నేర సామ్రాజ్యం, దాని ఆటకట్టించే పోలీసుల సాహసాలు, సమాజంపై మాఫియా ప్రభావం ఇలాంటివి పూరీ కథల్లో చేరాయి. 'పోకిరీ' అలా తయారైన సినిమానే.
సోషల్ యాంగిల్ తో సినిమాలు చేయడం ప్రారంభించాక.మళ్లి తన వెనకటి తరహా సినిమాలకు వెళ్లలేకపోయాడు పూరీ. తను సమాజంలో చూస్తున్న సంగతులు, వ్యక్తిగతంగా తనకు ఎదురైన పరిస్థితులు ఇవన్నీ కథలుగా క్యారెక్టర్లుగా రాసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీ బాధలు తెలిసిన వాడుగా 'నేనింతే' చేశాడు. మనిషిని నమ్మి మోసపోయిన తన గతం సాక్షిగా 'బిజినెస్ మేన్ ' రూపొందించాడు. చిన్నప్పటి నుంచి చలం సాహిత్యాన్ని చదివిన ప్రభావంతో 'జ్యోతిలక్ష్మి' తెరకెక్కించాడు. దశాబ్దాలు, శతాబ్దాలు గడిచినా మహిళా లోకంలో వచ్చిన శాశ్వత అభివృద్ధి ఏంటని ప్రశ్నించాడు. తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంగా పవన్ కళ్యాణ్ తో 'కెమెరా మెన్ గంగతో రాంబాబు' తెరపైకి తీసుకొచ్చాడు.
పూరీ జగన్నాథ్ సంధించిన తాజా అస్త్రం 'ఇజం'. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించారు. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు విదేశాల్లో దాచుకున్న నల్లధనం అంశాన్ని ప్రస్థావించాడు పూరీ. ఓ పరిశోధక పాత్రికేయుడు లక్షల కోట్ల విలువైన నల్లధనాన్ని పేద ప్రజలకు చేర్చే కలను చూపించాడు. ఇది వర్తమానంలో సాధ్యం కాకపోయినా.ఇలా జరిగితే బాగుంటుందనే ఆశను కలిగించాడు. పదిమందికి ఉపయోగపడని జర్నలిజం చదువు ఎందుకని ప్రశ్నించాడు. ఇలా వర్తమానాంశాలపై తన భావ స్రవంతిని కమర్షియల్ అంశాల మేళవింపుతో తనకున్న రచనా పాటవంతో సినిమాలుగా చేస్తున్నాడు పూరీ.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







