బ్రిటన్ ప్రధాని భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు...
- October 27, 2016బ్రిటన్లో ఉంటున్న భారతీయులకు ఆ దేశ ప్రధానమంత్రి థెరిస్సా మే.. దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. హౌస్ ఆఫ్ పార్లమెంట్లో హిందూ ఫోరమ్ ఆఫ్ బ్రిటన్(హెచ్ఎఫ్బీ) నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆమె పంపిన సందేశాన్ని పార్లమెంట్ అధికారి బాంబ్ బ్లాక్మెన్ చదివి వినిపించారు. 'బ్రిటన్లోని భారతీయులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఎంతో శ్రమిస్తారు. సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి కష్టపడి వాటిని వృద్ధిలోకి తీసుకొస్తారు. అంతేగాకుండా తమ కుటుంబాలకు తగిన ప్రాధాన్యత ఇస్తారు. వారిని చూసి గర్విస్తున్నా' అని ఆమె సందేశంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు వచ్చే నెలలో భారత్ పర్యటనకు రానున్నట్లు ఆమె తెలిపారు'.ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ఆమె తొలిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు.థేమ్స్ నదీ తీరాన ఉన్న హౌస్ ఆఫ్ కామన్స్లోని టెర్రస్ పెవిలియన్లో ఈ వేడుకలు జరిగాయి. మంత్రోచ్ఛరణలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందులో పార్లమెంటు సభ్యులు, అక్కడ నివసిస్తున్న పలువురు భారతీయులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్