నిరసనకారుడి జైలు శిక్ష తగ్గింపు
- October 27, 2016
మనామా: స్థానిక పొలిటికల్ సొసైటీ జనరల్ సెక్రెటరీ, యెమెన్లో సౌదీ నేతృత్వంలో జరుగుతున్న ఆపరేషన్పై అసత్యాలు ప్రచారం చేసిన కేసులో ఐదేళ్ళ శిక్షను ఎదుర్కొంటుడగా, అతని శిక్షను మూడేళ్ళకు సుప్రీం అపీల్స్ కోర్ట్ తగ్గించింది. మార్చ్ 2015లో సౌదీ నేతృత్వంలో పలు దేశాలు యెమెన్లోని హుతి రెబల్స్పై ఎయిర్ స్ట్రైక్స్ ప్రారంబించింది. యెమెన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రవాదులు సృష్టిస్తున్న మారణహోమాన్ని నిలువరించేందుకు ఈ దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ దాడులపై అసత్య కథనాల్ని నేషనల్ డెమొక్రటిక్ అసెంబ్లీ (అల్ వదావి) జనరల్ సెక్రెటరీ ఫదెల్ అబ్బాస్ ప్రచారం చేశారు సోషల్ మీడియా ద్వారా. అయితే తన క్లయింట్ ఎలాంటి చట్టాల్నీ అతిక్రమించలేదంటూ అబ్బాస్ తరఫు లాయర్ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. అబ్బాస్కి డిప్యూటీ అయిన మొహమ్మద్ అల్ మొతావాపైనా విచారణ కొనసాగుతోంది ఇదే కేసులో. మిలిటరీ ఆపరేషన్స్ని కించపర్చేలా అసత్య ప్రచారం చేసినందుకుగాను ఆయనపైనా కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







