దీపావళి బోనస్గా.. 1,260 కార్లు, 400 ఫ్లాట్లు. ఉద్యోగులకు వరాల జల్లు
- October 28, 2016
దీపావళి పండుగకు భారతదేశంలో కొన్ని ప్రముఖ కంపెనీలు స్వీట్ పాకెట్ తో ఉద్యోగులను సంతృప్తి పరుస్తాయి. మరికొన్ని సంస్థలు పండుగ చీకటిపడిన తర్వాత కదా ...పగలు పని చేయండని కఠినంగా హుకుం జారీ చేస్తారు ...కానీ , భారతదేశంలోనే బిన్నంగా గుజరాత్లోని ఓ వ్యాపార దిగ్గజం.. దీపావళికి తమ ఉద్యోగస్తులకు కళ్లు చెదిరే బోనస్ పాయింట్లు అందచేశారు గుజరాత్ సూరత్లోని వజ్రాల వ్యాపారి, కోటీశ్వరుడు సావ్జీ ఢోలకియా ఈ దీపావళికి ఉద్యోగులకు భారీ కానులకిచ్చి.. తన ఉదారతతో తనకు సాటి అయిన వారు లేరని మరోసారి చాటిచెప్పారు. ప్రతి ఏటా ఉత్తమ సేవలు అందించే ఉద్యోగులకు పెద్ద ఎత్తున బహుమానాలు ఇస్తూ ప్రత్యేకత చాటుకునే ఢోలకియా.. తన ఉద్యోగులకు దీపావళి బోనస్గా 1,260 కార్లు, 400 ఫ్లాట్లు బహుమతులుగా ప్రకటించింది.
కంపెనీ స్వర్ణోత్సవాల్ని పురస్కరించుకుని ఈ ఏడాది బోనస్ కోసం రూ.51 కోట్లు వెచ్చిస్తోంది. కంపెనీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగుల జాబితాలో 1,716 మంది ఉన్నారు. బోనస్ వివరాల్ని మంగళవారం ఉద్యోగులతో నిర్వహించిన అనధికార సమావేశంలో ప్రకటించారు. గతంలో బోనస్ కోసమే రూ.50కోట్లు వెచ్చించినట్లు హరేకృష్ణ ఎక్స్పోర్ట్ ఢోలకియా వెల్లడించారు. ఉద్యోగులను సంతోషపరిచేందుకు వారిని తృప్తి పరిచేందుకు ఢోలకియా ఇలాంటి బహుమతులను అందిస్తోంది. 75 దేశాలలో ప్రముఖ పాలిష్ కంపెనీలు ఒకటిగా ఈ సంస్థ భారతదేశం డైమండ్ కేంద్రంగా సూరత్ నుంచి వజ్రాలు ఎగుమతులు చేస్తుంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







