దీపావళికి బోనస్ రూపంలో ఈ ఖరీదైన నజరానా....
- October 28, 2016
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. గుజరాత్..సూరత్లోని డైమండ్ మర్చంట్ సావ్ జీ ధోలాకియా సంస్థలో పని చేసే సిబ్బంది ఎగిరి గంతేస్తారు. ఈ పండుగకు బోనస్ గా ఈ వ్యాపారి... వారికి ఈసారి వెయ్యికి పైగా కొత్త కార్లు, 400 ప్లాట్లు కానుకగా అందజేయనున్నారు. హరేకృష్ణ ఎక్స్ పోర్ట్స్ ఓనర్ అయిన సావ్ జీ.. తమ సంస్థలో ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన వారికి ఈ నజరానాలు అందజేయనున్నారు.ఈ సంవత్సరం 1716 మంది ఉద్యోగులను బెస్ట్ ఎంప్లాయీస్ గా గుర్తించినట్టు ఆయన చెప్పారు. ప్రతి సంవత్సరం ఇలా ఆయన దీపావళికి బోనస్ రూపంలో ఈ ఖరీదైన నజరానాలను అందజేస్తున్నారు. ఇప్పటికే కార్లు ఉండి..సొంత అపార్ట్ మెంట్లు లేనివారికి అపార్ట్ మెంట్లను, ఫ్లాట్లు ఉండి కార్లు లేనివారికి కార్లను ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.1100 చదరపు అడుగుల ఫ్లాట్ ఒక్కొక్కటి 15 లక్షలు ఖరీదు చేస్తుందని, అయిదేళ్ళ తరువాత ఉద్యోగులు నెలకు 11 వేలు చెల్లిస్తే సరిపోతుందని ఆయన చెప్పారు. గత ఏడాది ఈ సంస్థ తమ సిబ్బందికి 491 కార్లను, 200 ఫ్లాట్లను అందజేసింది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









