బ్యూటీ సెంటర్ నెలరోజులపాటు మూసివేత
- October 28, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ (ఎంఇసి), న్యూ సలాతాలోని ఓ బ్యూటీ సెంటర్ని నెల రోజులపాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ బ్యూటీ సెంటర్లో గడువుతీరిన ఉత్పత్తుల్ని వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వినియోగదారుల భద్రత చట్టం, దానికి సంబంధించిన నిబంధనల్ని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉల్లంఘనల్ని గుర్తించడానికి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఉల్లంఘనలపై వినియోగదారులు మినిస్ట్రీకి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు. హాట్లైన్, ఇ-మెయిల్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఎంఇసి మొబైల్ యాప్ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







