నవంబర్ 17న విడుదల కానున్న 'జయమ్ము నిశ్చయమ్మురా'

- October 29, 2016 , by Maagulf
నవంబర్ 17న విడుదల కానున్న 'జయమ్ము నిశ్చయమ్మురా'

శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "జయమ్ము నిశ్చయమ్మురా". "సమైక్యంగా నవ్వుకుందాం" అనే ట్యాగ్ లైన్ తో.. "దేశవాళీ వినోదం" అనే సరికొత్త నినాదంతో సందడి చేస్తూ.. అందరి దృష్టినీ అమితంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం నవంబర్ 17న విడులవుతోంది.
ఈ చిత్రం హక్కులు ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్ 7 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సంస్థ ఇంతకుముందు విక్రమ్-నయనతార నటించిన "ఇంకొక్కడు" చిత్రాన్ని నిర్మించింది.
దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి మాటాడుతూ.. "మా సినిమా పాట చూసి సినిమాను ప్రమోట్ చేసిన డైరెక్టర్ సుకుమార్ గారికి.. సినిమా నచ్చి, ఈ చిత్రం హక్కులు తీసుకున్న "ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్" నీలం కృష్ణారెడ్డిగారికి కృతజ్ఞతలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com