టూరిస్టుల కోసం రెంట్ ఎ బైక్ ఫెసిలిటీ
- October 29, 2016
అప్పట్లో టౌనుకెళ్తే.. అవసరాలకు తిరగడానికి అద్దె సైకిళ్లుండేవి.. రూపాయిచ్చి.. పనులన్నీ చూసుకున్నాక.. తిరిగి దాన్ని ఇచ్చేసి బస్సెక్కేసేవాళ్లు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇంటికో బైక్ ఉంది. అనుకోవడమే ఆలస్యం.. నిమిషాల్లో ఎక్కడికైనా దూసుకెళ్లిపోవచ్చు. కానీ ఇది లోకల్ వరకే. ఎక్కడికైనా టూర్లు వెళ్తే మాత్రం ఆటోలు, ట్యాక్సీలు పట్టుకోవాల్సిందే. విశాఖ వచ్చే టూరిస్టులకు ఆ కష్టాలు దూరం చేస్తామంటున్నారు నగరవాసులు. అద్దెకు బైక్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్కు తెరతీశారు.
విశాల సాగరతీరం, చుట్టూ అడవులు, కొండలు.. అంత అందంగా ఉంటుంది కాబట్టే దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది విశాఖ. అందుకే దేశ, విదేశీ పర్యాటకులతో సిటీ ఎప్పుడూ కిటకిటలాడుతుంటుంది. కానీ వెళ్లాల్సిన చోటుకు వెళ్లాలంటే సమయానికి క్యాబ్ లు, ట్యాక్సీలు దొరకడం కష్టం. దీనికి తోడు సిటీ ట్రాఫిక్ టూరిస్టులకు చుక్కలు చూపిస్తుంది. దీనికి పరిష్కారం ఆలోచించారు విశాఖ యువకులు. టూరిస్టులకు టూ వీలర్ అద్దెకిచ్చే సరికొత్త సౌకర్యాన్ని స్టార్ట్ చేశారు.
కొత్త ప్రాంతమే అయినా ఒక బైక్ మన దగ్గర ఉంటే సిటీలో దూసుకెళ్లిపోవచ్చు. ఆ ఆలోచనే నగర యువతలో అద్దె బైక్ ఆలోచనకు బీజం పడేలా చేసింది. కానీ సిటీకి వచ్చే ముక్కూ మొహం తెలీని వారికి అద్దెకు బైక్ ఎలా ఇస్తారు అనేగా మీ డౌట్. ఆ సందేహాలే అవసరం లేదు. బైక్ తీసుకోడానికి మీకు విశాఖలో ఎవరూ తెలిసుండాల్సిన పనిలేదు. ప్రాసెస్ చాలా సింపుల్. సాఫ్ట్ వేర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఓ యవకుడి అద్దెకు బైక్ తీసుకోవడంలో ఎదురైన ఇబ్బందులే అతడు జాగో రైడర్స్ సంస్థను ప్రారంభించడానికి కారణమైంది.
దేశంలోని చాలా నగరాల్లో అద్దెకు బైకిచ్చే కాన్సెప్ట్ ఉంది. కానీ ఆ బైక్ తీసుకోవాలంటే బ్యాంక్ లోన్ రేంజిలో ఉండేది.. అతడి గురించి ఎంక్వైరీలు చేసి, ఎనాలసిస్ లు పూర్తి చేస్తారు. బైకు ధరను బట్టి వేలకు వేలు సెక్యూరిటీ డిపాజిట్ కట్టించుకుంటారు. అంతా అయ్యాక ఇచ్చే బైకు అద్దె కూడా సామాన్యుల తీసుకునే రేంజిలో ఉండదు. విశాఖ వచ్చే పర్యాటకులకు అలాంటి కష్టాలేవీ లేకుండా చేసింది జాగో రైడర్స్. బైక్ కోరుకోవడమే ఆలస్యం.. నిమిషాల్లో కావల్సిన చోటుకు దూసుకెళ్లేలా చేస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







