అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ముగింపు వేడుకలు అంబరాన్నంటాయి..
- October 29, 2016మరావతి షాపింగ్ ఫెస్టివల్ ముగింపు వేడుకలు అంబరాన్నంటాయి.. పవిత్ర సంగమం దగ్గర బాణసంచా వెలుగులు మిన్నంటాయి.. హారతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన లక్ష్యమన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో దీనావళి వెలుగు నింపాలని ఆకాంక్షించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం దగ్గర నిర్వహించిన అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ముగింపు వేడుకల్లో చంద్రబాబు సతీసమేతంగా పాల్గొన్నారు.రాష్ట్రంలో వెనుకబడిన కులాలు, వర్గాలు, ప్రాంతాలు, జిల్లాలు అభివృద్ధి కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అందుకోసం ప్రతి పేదకుటుంబానికి సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నట్లు చెప్పారు. ప్రతి కుటుంబానికి 10వేల ఆదాయం చేకూర్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేద మంత్రాల నడుమ కృష్ణమ్మకు పవిత్ర హారతి ఇచ్చారు పండితులు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు.ఇక హారతి అనంతరం నరకాసుర వధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా బాణం వేశారు. ఆ తర్వాత సంగమం ప్రాంతమంతా బాణసంచా వెలుగులు మిన్నంటాయి.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు