దుబాయ్లో బెస్ట్ క్యాబ్ డ్రైవర్ ఈ లాయర్
- November 02, 2016
పాకిస్తానీ లాయర్ ఒకరు ట్యాక్సీడ్రైవర్గా మారి, బెస్ట్ ట్యాక్సీ డ్రైవర్గా అవార్డును అందుకున్నారు. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) మంగళవారం ఈ అవార్డును ఆయనకు ప్రకటించింది. 39 ఏళ్ళ ముంతాజిర్ హుస్సేన్, పాకిస్తాన్లోని సింధ్ హైకోర్టులో ఐదేళ్ళపాటు 'లా' ప్రాక్టీస్ చేశారు. అయితే 2008లో అనుకోకుండా ఆయన ట్యాక్సీ డ్రైవర్గా మారాల్సి వచ్చింది. ఆర్టిఎ ఇటీవల బెస్ట్ ట్యాక్సీ డ్రైవర్లను ఎంపిక చేయగా, అందులో హుస్సేన్కి కూడా చోటు దక్కింది. ఆర్టిఎకి చెందిన దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ (డిటిసి)లో హుస్సేన్ పనిచేస్తున్నారు. తొమ్మిదేళ్ళలో ఎప్పుడూ ఆయన ఎలాంటి యాక్సిడెంట్ చేయలేదు. స్వతహాగా లాయర్ని కావడంతో, నిబంధనల్ని జాగ్రత్తగా పాటించడం వల్లే తనకు ఈ గౌరవం దక్కిందని చెప్పారు హుస్సేన్. 50 మంది బెస్ట్ క్యాబ్ డ్రైవర్స్లో ఒకే ఒక్క మహిళగా మెలనీ మంగులాబ్నన్ ఎంపికయ్యారు. 39 ఏళ్ళ మెలనీ గడచిన మూడేళ్ళలో యాక్సిడెంట్ చేయకుండా, ఎలాంటి జరీమానాలకూ లోనుకాకుండా డ్రైవ్ చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







