పాత పాస్పోర్టులతో ఒమన్లోకి ఎంట్రీ కష్టమే
- November 03, 2016
మస్కట్: చేతి రాతతో కూడిన పాస్పోర్ట్లు కలిగిన వలసదారులు, ఒమన్లోకి అడుగు పెట్టడం ఇకపై కష్టమే కాదు, అసాధ్యం కూడా కావొచ్చు. ఎంబసీ అధికారులు ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. మస్కట్లోని నేపాల్ ఎంబసీ అధికారి రోజినా తమ్రాకర్ మాట్లాడుతూ, నేపాల్ గవర్నమెంట్, అంతర్జాతీయ విమానాల్లోకి చేతి రాత కలిగిన పాస్పోర్టుల్ని అనుమతించడంలేదని చెప్పారు. ఇండియన్ ఎంబసీకి చెందిన సీనియర్ అధికారి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఈ మేరకు విధించిన డెడ్లైన్ నవంబర్ 24తోనే ముగిసింది. అయితే కొన్ని దేశాల్లో ఈ గడువు కాస్త పొడిగించబడింది. ఇకపై నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేయనున్నామనీ, మెషీన్ రీడర్ పాస్పోర్ట్ ఉన్నవారికి తప్ప చేతి రాత పాస్పోర్ట్లను అనుమతించేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. వలసదారులు తమ తమ ఎంబసీలను సంప్రదించి వీలైనంత త్వరగా తమ పాస్పోర్ట్లను మార్చుకోవాల్సిందిగా అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







