వచ్చే విద్యా సంవత్సరం నుంచి నేపాల్ విద్యార్థులు భారత ఐఐటీల్లో...

- November 04, 2016 , by Maagulf
వచ్చే విద్యా సంవత్సరం నుంచి నేపాల్ విద్యార్థులు భారత ఐఐటీల్లో...

నేపాల్ విద్యార్థులకు భారత ఐఐటీల్లో ప్రవేశం లభించబోతోంది. నేపాల్ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నేపాల్ విద్యార్థులు ఐఐటీల్లో చేరే అవకాశం ఉంది. ఇందుకోసం నేపాల్‌లో సయితం ఐఐటీ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక విద్యాపరమైన సంబంధాలు అభివృద్ధి చేసుకునేందుకు భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని ప్రణబ్ వెల్లడించారు. వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com