రాఖీ సావంత్ పై ఎఫ్ఐఆర్
- November 04, 2016
అమెరికాలో జరిగిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలున్న కురచ దుస్తులు ధరించి బాలీవుడ్ నటి రాఖీ సావంత్ సృష్టించిన సంచలన అంతాఇంతా కాదు.
'ఆ డ్రెస్ తో మోదీ పరువు తీసింది..!'
అని తనపై దుమ్మెత్తి పోసివాళ్లకు ' మోదీ నా డ్రీమ్ మ్యాన్' అని ధీటుగా జవాబిచ్చిందామె. అయితే కాలప్రవాహంలో సర్దుమణిగిందనుకున్న ఆ వివాదం మళ్లీ తెరమీదికొచ్చింది.
అసభ్యకరమైన దుస్తులు ధరించారన్న కారణంగా నటి రాఖీ సావంత్ పై రాజస్థాన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. రాజసమండ్ జిల్లా కాంక్రోలీ పోలీస్ స్టేషన్ లో గురువారం రాత్రి నమోదుచేసిన కేసు వివరాలను ఆ స్టేషన్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. కాంక్రోలీకి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిద్యాదుమేరకు రాఖీ సావత్ పై కేసు నమోదుచేశామని, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు చెప్పారు. దీనిపై నటి స్పందన వెలువడాల్సిఉంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









