రాఖీ సావంత్ పై ఎఫ్ఐఆర్

- November 04, 2016 , by Maagulf
రాఖీ సావంత్ పై ఎఫ్ఐఆర్

అమెరికాలో జరిగిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలున్న కురచ దుస్తులు ధరించి బాలీవుడ్ నటి రాఖీ సావంత్ సృష్టించిన సంచలన అంతాఇంతా కాదు.
'ఆ డ్రెస్ తో మోదీ పరువు తీసింది..!'
అని తనపై దుమ్మెత్తి పోసివాళ్లకు ' మోదీ నా డ్రీమ్ మ్యాన్' అని ధీటుగా జవాబిచ్చిందామె. అయితే కాలప్రవాహంలో సర్దుమణిగిందనుకున్న ఆ వివాదం మళ్లీ తెరమీదికొచ్చింది.

అసభ్యకరమైన దుస్తులు ధరించారన్న కారణంగా నటి రాఖీ సావంత్ పై రాజస్థాన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. రాజసమండ్ జిల్లా కాంక్రోలీ పోలీస్ స్టేషన్ లో గురువారం రాత్రి నమోదుచేసిన కేసు వివరాలను ఆ స్టేషన్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. కాంక్రోలీకి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిద్యాదుమేరకు రాఖీ సావత్ పై కేసు నమోదుచేశామని, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు చెప్పారు. దీనిపై నటి స్పందన వెలువడాల్సిఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com