ఐఎస్ఐఎస్ మహిళా బానిసలును రక్షించిన ఇరాక్ దళాలు
- November 04, 2016
ఇరాక్: ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) బారిన పడి నరకం అనుభవించిన మహిళలకు స్థానిక ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు కలిసి సహాయపడుతున్నాయి. బాధితులు మానసికంగా నిలదొక్కుకునే వరకు వారికి అండగా ఉంటామని ప్రభుత్వం తెలిపింది.
బాధిత మహిళలు వారి కుటుంబంతో కలిసి జీవించేందుకు ప్రతి రోజూ కౌన్సెలింగ్ ఇస్తున్నామని ఇరాక్ ప్రభుత్వం తెలిపింది. సంకీర్ణ దళాలు చేపట్టిన ఆపరేషన్ మోసూల్ తుది దశకు చేరుకుంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇప్పటికే చెల్లాచెదురై పారిపోయారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల బారినపడి బానిసలుగా మారి నగ్నంగా తిరుగుతున్న మహిళలకు ఇప్పుడు సంకీర్ణ దళాల వలన విముక్తి లభిస్తుంది.
అయితే ఇప్పటికే సామూహిక అత్యాచారాలకు, లైకింగిక వేధింపులకు గురైన ఆ మహిళలు తీవ్ర నిరాశలో మునిగిపోయి కుంగిపోతున్నారు.
మానసికంగా నలిగిపోతున్న వారికి అండగా ఉంటూ సంరక్షణా కేంద్రంలో చికిత్స చేస్తున్నారు. ఆ మహిళలు, యువతులు మామూలు మనుషులు అయ్యేందుకు సహకరిస్తున్నామని ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వేతర అధికారులు చెబుతున్నారు.
డాక్టర్ నామ్ నవ్జత్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ మహిళల పరిస్థితుల గురించి ఆలోచిస్తేనే భయంగా ఉందని అన్నారు. గత మూడేళ్లుగా బాధితులకు సేవలు అందిస్తున్నామని, ప్రతీ ఒక్కరూ తీవ్ర విచారంలో మునిగిపోయారని అన్నారు.
ఎనిమిదేళ్ల బాలికలపైన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అత్యాచారానికి ఒడిగట్టారని డాక్టర్ నామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు తనను ఐదు సార్లు బానిసగా అమ్మేసారని, రోజూ అత్యాచారం చేసేవారని బాధిత మహిళ వాపోయింది.
తనను సిరియా, మోసూల్, తలాఫర్, అన్బర్ ప్రాంతాల్లో నగ్నంగా తిప్పారని ఆమె చెప్పారు. అక్కడి నుంచి బయటపడడం ఎలాగో అర్థంకాక నాలుగు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించానని ఆమె చెప్పారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద బాధిత మహిళలకు ధైర్యం చెప్పామని, అందరికీ పునరావాసం కల్పించేందుకు ఎన్జీవోల సహాయం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, సంకీర్ణ దళాలు ఇరాక్లోకి ప్రవేశించిన తర్వాతే తమకు స్వేచ్ఛ లభించిందని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద బాధిత మహిళలు బోరున విలపిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







