ఒమన్ కు చెందిన ముగ్గురు జాలర్లు జాక్ పాట్
- November 06, 2016
ఒమన్ కు చెందిన ముగ్గురు జాలర్లు జాక్ పాట్ కొట్టారు. కురాయత్ ప్రావిన్సు సమీపంలో గత వారం వేటకు వెళ్లిన వారికి సముద్రపు నీటిలో కొట్టుకెళ్తున్న అత్యంత అరుదైన తిమింగలపు శుక్ర కణం వారి దొరికినట్లు ఖలీద్ అల్ సినాని అనే జాలరి చెప్పాడు.
తిమింగలాల శుక్ర కణాలను ప్రత్యేక పర్ ఫ్యూమ్ ల తయారీలో వినియోగిస్తారు. చేపల వేటకు వెళ్లిన సమయంలో పెద్ద ఎత్తున దుర్వాసన వస్తుండటంతో అటువైపుగా వెళ్లామని సినాని చెప్పాడు. కొట్టుకెళ్తున్న తిమింగలపు శుక్ర కణాన్ని తన సహచరుల సాయంతో తాడుకు కట్టి బోటులోకి ఎక్కించుకున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత అమితానందంతో ఒడ్డుకు వచ్చినట్లు చెప్పాడు.
మొదటి రెండు రోజుల పాటు దుర్వాసనను వెదజల్లిన శుక్ర కణం ఆ తర్వాత సువాసన ఇవ్వడం మొదలు పెట్టిందని తెలిపాడు.
నిపుణులతో పరిశీలించని తర్వాత శుక్ర కణాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించి ఎండబెట్టినట్లు చెప్పాడు. కాగా, 18 కిలోల బరువు గల శుక్రకణం విలువ దాదాపు 2.5 మిలియన్ డాలర్లు పలికే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!









