ఇరాక్‌లో ఆత్మాహతి దాడులు 21 మంది మృతి

- November 06, 2016 , by Maagulf
ఇరాక్‌లో ఆత్మాహతి దాడులు 21 మంది మృతి

ఇరాక్‌లోని టిక్రిట్‌, సమారా ప్రాంతాల్లో ఆదివారం జరిగిన రెండు ఆత్మాహతి దాడుల్లో 21 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. టిక్రిట్‌లోని రద్దీ ప్రాంతంలో ముష్కరులు అంబులెన్స్‌లో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 13 మంది మృతిచెందారు. ఇది జరిగిన కొద్దిసేపటికే సమారాలోని కార్‌ పార్కింగ్‌ వద్ద ఇదే తరహాలో అంబులెన్స్‌తో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 8 మంది మృతిచెందారు. ఈ రెండు ఘటనల్లో వందల మంది గాయపడటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో రెండు నగరాల్లో కర్ఫ్యూ విధించినట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com