'సప్తగిరి ఎక్స్ప్రెస్' ఆడియో విడుదల చేసిన పవర్ స్టార్
- November 06, 2016
హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సప్తగిరి. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'సప్తగిరి ఎక్స్ప్రెస్'. అరుణ్ పవార్ దర్శకుడు. సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై డాక్టర్ కె.రవికిరణ్ నిర్మిస్తున్నారు. బల్గానిన్ స్వరాలు సమకూర్చారు. హైదరాబాద్లో ఆదివారం జరిగిన ఆడియో విడుదల కార్యక్రమానికి సినీనటుడు పవన్కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆడియోను ఆవిష్కరించారు. 'సప్తగిరి ఎక్స్ప్రెస్' మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పవన్కల్యాణ్ మాట్లాడుతూ.. 'గబ్బర్సింగ్'లో సప్తగిరి నటించారు.చిన్న వేషం అయినా అది చూసినప్పుడల్లా పడి పడి నవ్వేవాడిని. తొలుత చిత్రానికి 'కాటమరాయుడు' అని పెట్టుకున్నారు. కానీ మా చిత్ర బృందం ఆ టైటిల్ అడిగితే ఎంతో ఉదాత్తంగా ఇచ్చేశారు. నటుడు సప్తగిరి, నిర్మాత కిరణ్, దర్శకుడిది అరుణ్ పవార్లది గొప్ప సంస్కారం. మామూలుగా సినిమాలను తక్కువ చూస్తా. ఆఖరికి నా సినిమాలు కూడా ఒక్కోసారి చూడను. కానీ సప్తగిరి నటించిన ఈ సినిమా తప్పకుండా చూడాలని కోరిక కలుగుతోంది. ప్రత్యేక షో వేయించుకుని చూస్తా. చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
కథానాయకుడు సప్తగిరి మాట్లాడుతూ.. 'ఇంతమంది మెగా అభిమానుల మధ్య ఒక మెగా అభిమాని ఆడియో ఫంక్షన్ జరుగుతోంది. పవన్ కల్యాణ్గారి సమక్షంలో ఇలాంటి ఓ కార్యక్రమం జరుగుతుందని నా జీవితంలో వూహించలేదు. పుట్టినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవిని చూస్తూ, అభిమానిస్తూ, ఆరాధిస్తూ ఉన్నాను. నేను నిజాయతీ గల మెగా అభిమానిని కనుకే పవన్ నా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.. ఆయనకు రుణపడి పడి ఉంటా. ఇంత చిన్న సినిమాకు రూ.కోట్లు విలువ చేసే అభిమానాన్ని పంచినందుకు పవన్కల్యాణ్ గారికి ధన్యవాదాలు' అని అన్నారు.
కార్యక్రమంలో సినీ నటులు అలీ, సునీల్, నాగ్ అన్వేష్, హేమ, నిర్మాత శరత్మరార్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







