జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రయాణంలో ప్రయాణికుడు మృతి...

- November 08, 2016 , by Maagulf
జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రయాణంలో  ప్రయాణికుడు మృతి...

విమాన ప్రయాణంలోనే ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన దిల్లీ నుంచి ఖతార్‌ రాజధాని దోహాకు వెళ్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో చోటుచేసుకుంది. ప్రయాణికుడు అస్వస్థతకు గురవ్వడంతో వైద్య సహాయం కోసం వెంటనే విమానాన్ని కరాచీకి మళ్లించారు. ముందుగానే అక్కడ వైద్య సహాయం కోసం ఏర్పాట్లు కూడా చేయించారు. అయితే కరాచీ చేరుకునేప్పటికే ప్రయాణికుడు మృతి చెందినట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ వెల్లడించింది. సోమవారం రాత్రి దిల్లీ నుంచి బోయింగ్‌ 737 విమానం 141 మంది ప్రయాణికులతో బయలుదేరగా ఈ ఘటన జరిగింది. అయితే మరణించిన ప్రయాణికుడి వివరాలను జెట్‌ ఎయిర్‌వేస్‌ వెల్లడించలేదు.ప్రయాణికుడి మృతదేహాన్ని అధికారులకు అప్పగించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com