జెట్ ఎయిర్వేస్ ప్రయాణంలో ప్రయాణికుడు మృతి...
- November 08, 2016
విమాన ప్రయాణంలోనే ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన దిల్లీ నుంచి ఖతార్ రాజధాని దోహాకు వెళ్తున్న జెట్ ఎయిర్వేస్ విమానంలో చోటుచేసుకుంది. ప్రయాణికుడు అస్వస్థతకు గురవ్వడంతో వైద్య సహాయం కోసం వెంటనే విమానాన్ని కరాచీకి మళ్లించారు. ముందుగానే అక్కడ వైద్య సహాయం కోసం ఏర్పాట్లు కూడా చేయించారు. అయితే కరాచీ చేరుకునేప్పటికే ప్రయాణికుడు మృతి చెందినట్లు జెట్ ఎయిర్వేస్ వెల్లడించింది. సోమవారం రాత్రి దిల్లీ నుంచి బోయింగ్ 737 విమానం 141 మంది ప్రయాణికులతో బయలుదేరగా ఈ ఘటన జరిగింది. అయితే మరణించిన ప్రయాణికుడి వివరాలను జెట్ ఎయిర్వేస్ వెల్లడించలేదు.ప్రయాణికుడి మృతదేహాన్ని అధికారులకు అప్పగించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. జెట్ ఎయిర్వేస్ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







