రొయ్యల వేటపై నిషేధం లేదు
- November 08, 2016
మనామా: అధికారికంగా రొయ్యల వేటపై ఎలాంటి నిషేధం లేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. వర్క్స్ మరియు మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్ట్రీ ఈ మేరకు స్పష్టతను ఇచ్చింది. అయితే చేపల వేట, రొయ్యల వేటకు సంబంధించి కొన్ని విధానాలపై నిషేధం విధించాలన్న ప్రతిపాదనలు మాత్రం పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 150 కిలోల బరువైన వలల్ని చేపలు, రొయ్యల వేట కోసం వినియోగిస్తుండడం వల్ల చిన్న చిన్న సముద్ర జీవులు మృత్యువాత పడ్తున్నాయనీ తద్వారా అపారమైన సముద్ర సంపద నాశనమవుతోందనే ఫిర్యాదుల మేరకు ఈ ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, ఫిషర్మెన్ ప్రయోజనాలు దెబ్బతినకుండా, సముద్ర పర్యావరణాన్ని రక్షించే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు అధికారులు. ప్రపంచ స్థాయిలో దీనికి సంబంధించిన అనుసరిస్తున్న పద్ధతులు, వాటిలో మెరుగైన విధానాల గురించి అధికారులు అధ్యయనం చేస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో చేపల వేట లేదా రొయ్యల వేట సముద్రంలో కొనసాగిస్తే సమస్య తీవ్రత తగ్గుతుందని పలువురు అభిప్రాయపడుతుండడం జరుగుతోంది.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









