రొయ్యల వేటపై నిషేధం లేదు
- November 08, 2016
మనామా: అధికారికంగా రొయ్యల వేటపై ఎలాంటి నిషేధం లేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. వర్క్స్ మరియు మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్ట్రీ ఈ మేరకు స్పష్టతను ఇచ్చింది. అయితే చేపల వేట, రొయ్యల వేటకు సంబంధించి కొన్ని విధానాలపై నిషేధం విధించాలన్న ప్రతిపాదనలు మాత్రం పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 150 కిలోల బరువైన వలల్ని చేపలు, రొయ్యల వేట కోసం వినియోగిస్తుండడం వల్ల చిన్న చిన్న సముద్ర జీవులు మృత్యువాత పడ్తున్నాయనీ తద్వారా అపారమైన సముద్ర సంపద నాశనమవుతోందనే ఫిర్యాదుల మేరకు ఈ ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, ఫిషర్మెన్ ప్రయోజనాలు దెబ్బతినకుండా, సముద్ర పర్యావరణాన్ని రక్షించే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు అధికారులు. ప్రపంచ స్థాయిలో దీనికి సంబంధించిన అనుసరిస్తున్న పద్ధతులు, వాటిలో మెరుగైన విధానాల గురించి అధికారులు అధ్యయనం చేస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో చేపల వేట లేదా రొయ్యల వేట సముద్రంలో కొనసాగిస్తే సమస్య తీవ్రత తగ్గుతుందని పలువురు అభిప్రాయపడుతుండడం జరుగుతోంది.
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







