భారత్కి తిరిగి వచ్చిన దౌత్యాధికారులు...
- November 10, 2016
భారత దేశ ఇంటెలిజెన్స్ బ్యూరోకి గూఢచారులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ 8 మంది దౌత్యాధికారుల పేర్లను బయట పెట్టిన పాకిస్థాన్ వారిని భారతదేశానికి తిరిగి పంపింది. ఈ క్రమంలో గురువారం ఐదుగురిని భారత్కి పంపినట్లు అధికారులు, మీడియా సంస్థలు వెల్లడించాయి. 8 మందిలో ముగ్గురు భారత్కు సోమవారం చేరుకోగా మిగిలిన ఐదుగురు ఈరోజు భారత్కి తిరిగి వచ్చారు.దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఓ ఐఎస్ఐ అధికారి విచారణ సమయంలో వెల్లడించిన ఆధారాల మేరకు గూఢచర్యం ఆరోపణలతో దిల్లీలోని పాకిస్థాన్ హైకమిషనర్ కార్యాలయం అధికారి అక్తర్, మరో ఉద్యోగిని భారత్ నవంబరు 2న తిరిగి వెళ్లిపోవాల్సిందిగా కోరింది.దీనికి సమాధానంగా పాకిస్థాన్ కూడా 8 మంది భారత దౌత్యాధికారులు గూఢచర్యం చేస్తున్నారంటూ ఆరోపించి వారిని తిప్పి పంపించింది
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







