విక్రమ్,గౌతమ్ ల కొత్త చిత్రం
- November 12, 2016
'ఇరుముగన్' సినిమాతో కాస్త ట్రాక్లో పడ్డారు నటుడు విక్రం. త్వరలో ఆయన 'సామి 2' చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత లేకుంటే ఏకకాలంలో మరో చిత్రంలో కూడా నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి గౌతం మేనన్ దర్శకత్వం వహించనున్నారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. దీని గురించి గౌతం మేనన్ మాట్లాడుతూ విక్రంతో ఓ సినిమాను రూపొందించేందుకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించనున్నట్లు చెప్పారు. మరోవైపు 'ఇరుముగన్' ఫేమ్ ఆనంద్ శంకర్ వద్ద కూడా విక్రం కథ విన్నట్లు సమాచారం.
దీన్ని కూడా పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారు విక్రం. కానీ గౌతం మేనన్ సినిమాకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నట్లు కోడంబాక్కం వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన వైశాలి: వరల్డ్ టైటిల్ రేసులో భారత యువ కెరటం!
- ప్రాంతీయ స్థిరత్వంపై సౌదీ క్రౌన్ ప్రిన్స్–పాకిస్థాన్ ప్రధాని కీలక భేటీ
- ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్ స్థిరత్వం పై ఖతార్ అమీర్–అమెరికా అధ్యక్షుడు ఫోన్ చర్చ
- ఇరాన్కు రోజుకు రూ.4 వేల కోట్ల నష్టం
- సౌదీ ట్రాన్సిట్ వీసా ఫెసిలిటీ సస్పెండ్: ఇండియన్ ఎంబసీ
- ఉద్రిక్తతల తగ్గింపు, ఇంధన స్థిరత్వంపై అమీర్, ట్రంప్ చర్చలు..!!
- పిల్లల ఇ-స్కూటర్ దుర్వినియోగానికి తల్లిదండ్రులే బాధ్యులా?
- సౌదీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం..లిబియా పై కీలక నిర్ణయం..!!
- వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డే: శుక్రవారం ఉచిత బస్ రైడ్స్..!!









