విక్రమ్,గౌతమ్ ల కొత్త చిత్రం
- November 12, 2016
'ఇరుముగన్' సినిమాతో కాస్త ట్రాక్లో పడ్డారు నటుడు విక్రం. త్వరలో ఆయన 'సామి 2' చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత లేకుంటే ఏకకాలంలో మరో చిత్రంలో కూడా నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి గౌతం మేనన్ దర్శకత్వం వహించనున్నారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. దీని గురించి గౌతం మేనన్ మాట్లాడుతూ విక్రంతో ఓ సినిమాను రూపొందించేందుకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించనున్నట్లు చెప్పారు. మరోవైపు 'ఇరుముగన్' ఫేమ్ ఆనంద్ శంకర్ వద్ద కూడా విక్రం కథ విన్నట్లు సమాచారం.
దీన్ని కూడా పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారు విక్రం. కానీ గౌతం మేనన్ సినిమాకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నట్లు కోడంబాక్కం వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







