పిల్లలను మళ్లీ స్కూళ్లకు పంపేటపుడు...
- August 28, 2015
సెలవుల తరువాత చిన్నారులను మళ్లీ స్కూళ్లకు పంపడం, తల్లిదండ్రులకు బ్రహ్మవిద్యే! ఐతే స్కూళ్ళు ప్రారంభించడానికి కొన్నిరోజుల ముందే పిల్లలకు సమయానికి తయారవడం, అల్పాహారం తీసుకోవడం అలవాటు చేయాలని, అందువల్ల పిల్లలు స్కూల్ రొటీన్ కు అలవాటుపడి, ఇబ్బందిపడకుండా ఉంటారని, పాఠశాలలు మరియు విద్యా సంస్థల ఆరోగ్య శాఖ ఉపాధ్యక్షుడు డా. హమేద్ యగ్యా హుస్సైన్ సలహా ఇచ్చారు. స్కూళ్లకు తిరిగి పంపే ప్పుడు పాటించవలసి అరోగ్య చిట్కాలను గురించి చర్చిస్తూ, ప్రత్యేకించి మాంసం వంటి వంటకాలను లంచ్ లో పెట్టేప్ప్పుడు, అవి చెడిపోకుండా ఐస్ ప్యాక్ వంటివి వాడాలని, అంటు వ్యాధులు వ్యాప్తించకుండా ఉండాలంటే, తల్లిదండ్రులు వారిని 3-5 రోజులు బడికి పంపకుండా ఉండడమే ఉత్తమమని అన్నారు. పిల్లల స్కూలు బాగు, వారిబరువులో 10 శాతం కంటే తక్కువ ఉండాలని, ఇంట్లో టెలివిజను, కంప్యూటర్లు, వీడియో గేములు వంటి స్క్రీన్ ఫ్రీ జోన్లను ఏర్పాటుచేయడం ద్వారా వారు దీక్షగా చదువుకోనేలా ప్రోత్సహించాలని; వారు ప్రశాంతంగా కనీసం 10 గంటలు నిద్రపోవాలని, అందుకై అన్ని డిజిటల్, ఎలక్ట్రానిక్ పరికరాలను నిద్రకు ముందే ఆపివేయాలని డాక్టర్ల సూచనలు. మరి, పాటిద్దామా!
--- సి. శ్రీ (దుబాయ్)
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







