యూఏఈ ఎక్స్ఛేంజ్లో రూ.8,00,000 మార్పిడికి యత్నం
- November 13, 2016
యూఏఈలోని భారతీయ వలసదారులు మనీ ఎక్స్ఛేంజెస్ వద్ద పెద్ద మొత్తంలో ఇండియన్ కరెన్సీతో బారులు తీరారు. 500, 1000 నోట్లను భారత ప్రభుత్వం రద్దుచేసిన తరువాత, ఆ పాత నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించడంతో తమ వద్దనున్న పాత కరెన్సీని మార్చుకునేందుకు యూఏఈలోనూ భారతీయ వలసదారులు పోటీపడుతున్నారు. ఓ వ్యక్తి, తన వద్దనున్న బ్యాగ్ని చూపించి అందులో 8,00,000 రూపాయలు ఉన్నాయనీ, వాటిని మార్చుకోదలచుకున్నానని మనీ ఎక్స్ఛేంజ్ అధికారులతో చెప్పాడు. దాంతో వారు షాక్కి గురయ్యారు. పెద్ద మొత్తంలో డబ్బుని ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉన్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో 2,00,000 రూపాయల సొమ్ము సబబుగా ఉంటుందని మనీ ఎక్స్ఛేంజ్ స్టాఫ్ ఒకరు తెలిపారు. అయితే వీటిల్లో చాలావరకు బ్లాక్ మనీ ఉండవచ్చనీ, కొంత మేర ఫేక్ కరెన్సీ ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్లాక్ మనీని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్య సబబేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ ఎంబసీ అధికారులు ఈ విషయంపై మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బ్లాక్మనీని అరికట్టే చర్యలకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









