పూర్తిస్థాయి వినోదభరిత చిత్రo 'మీలో ఎవరు కోటీశ్వరుడు'...
- November 17, 2016
నవీన్చంద్ర, శృతిసోది నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఇ.సత్తిబాబు దర్శకుడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. దర్శకుడు ఇ.సత్తిబాబు మాట్లాడుతూ, 'పూర్తిస్థాయి వినోదభరిత చిత్రమిది. నాగేంద్రకుమార్ మంచికథ అందించగా, క్రాంతి డైలాగ్స్ అందించారు. నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ, 'మా సంస్థ నిర్మిస్తున్న ఆరవ చిత్రమిది.ఇలాంటి కథను ఎవరు చేస్తే బావుంటుందా అని ఆలోచిస్తే సత్తిబాబు అయితే మంచిటైమింగ్తో సినిమా తీస్తారని భావించాం. ఒక పాట మినహా సినిమా పూర్తయింది. అయితే గేమ్ షో చిత్రం కాదు. అందరినీ కడుపుబ్బ నవ్వించేలా ఉంటుంది' అని అన్నారు.హీరో నవీన్చంద్ర మాట్లాడుతూ, 'ఇంతవరకు నేను ప్రేమ, యాక్షన్ సినిమాలే చేశాను. అయితే నాతో కామెడీ సినిమా చేస్తానని రాధామోహన్ చెప్పగానే ఈ తరహా సినిమాలు చేయలేదని చెప్పాను. దాంతో సత్తిబాబుగారిని కలవమని ఆయన చెప్పారు. కథ ఎంతోబాగా నచ్చడంతో వెంటనే చేసేందుకు అంగీకరించాను' అని చెప్పారు.కథానాయిక శృతిసోది మాట్లాడుతూ, ఇందులో ధనవంతురాలైన అమ్మాయి పాత్రను పోషించానని చెప్పగా, నటుడు పృథ్వి మాట్లాడుతూ, 'బెంగాల్ టైగర్' తర్వాత మరోసారి ఈ సంస్థ తీసిన ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందన్నారు
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









