పూర్తిస్థాయి వినోదభరిత చిత్రo 'మీలో ఎవరు కోటీశ్వరుడు'...
- November 17, 2016
నవీన్చంద్ర, శృతిసోది నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఇ.సత్తిబాబు దర్శకుడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. దర్శకుడు ఇ.సత్తిబాబు మాట్లాడుతూ, 'పూర్తిస్థాయి వినోదభరిత చిత్రమిది. నాగేంద్రకుమార్ మంచికథ అందించగా, క్రాంతి డైలాగ్స్ అందించారు. నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ, 'మా సంస్థ నిర్మిస్తున్న ఆరవ చిత్రమిది.ఇలాంటి కథను ఎవరు చేస్తే బావుంటుందా అని ఆలోచిస్తే సత్తిబాబు అయితే మంచిటైమింగ్తో సినిమా తీస్తారని భావించాం. ఒక పాట మినహా సినిమా పూర్తయింది. అయితే గేమ్ షో చిత్రం కాదు. అందరినీ కడుపుబ్బ నవ్వించేలా ఉంటుంది' అని అన్నారు.హీరో నవీన్చంద్ర మాట్లాడుతూ, 'ఇంతవరకు నేను ప్రేమ, యాక్షన్ సినిమాలే చేశాను. అయితే నాతో కామెడీ సినిమా చేస్తానని రాధామోహన్ చెప్పగానే ఈ తరహా సినిమాలు చేయలేదని చెప్పాను. దాంతో సత్తిబాబుగారిని కలవమని ఆయన చెప్పారు. కథ ఎంతోబాగా నచ్చడంతో వెంటనే చేసేందుకు అంగీకరించాను' అని చెప్పారు.కథానాయిక శృతిసోది మాట్లాడుతూ, ఇందులో ధనవంతురాలైన అమ్మాయి పాత్రను పోషించానని చెప్పగా, నటుడు పృథ్వి మాట్లాడుతూ, 'బెంగాల్ టైగర్' తర్వాత మరోసారి ఈ సంస్థ తీసిన ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందన్నారు
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







