ఈనెల10 నాటికి 3,456 మంది న్యాయమూర్తులను టర్కీ ప్రభుత్వం తొలగించింది
- November 18, 2016
టర్కీలో మరో 203 మంది న్యాయమూర్తులను తొలగించినట్టు అక్కడి న్యాయమూర్తులు, ప్రాసిక్యూటర్స్ నియామక కౌన్సిల్ (హెచ్ఎస్వైకే ) పేర్కొంది. కాగా, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ పాలనను వ్యతిరేకిస్తూ జూలై15న సైనిక తిరుగుబాటు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ తిరుగుబాటును అణిచివేయాలని ఎర్డోగన్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు వీధుల్లోకి చేరుకుని తిరుగుబాటుదారులను చితకబాదారు. దీంతో, సైనిక తిరుగుబాటు విఫలమైంది. అయితే, ఈ తిరుగుబాటు వెనుక పెన్సిల్వేనియాలో ప్రవాసముంటున్న మత గురువు ఫెతుల్లా గులెన్ హస్తముందని ఎర్డోగన్ అనుమానిస్తున్నారు. ఆయనకు మద్దతుగా నిలిచిన విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, వాణిజ్య సముదాయాలను ఇప్పటికే మూసివేశారు.ఈ తిరుగుబాటుకు సహకరిం చిన ఆరోపణలపై పలువురు న్యాయమూర్తులు, సైనికాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు, విశ్వవిద్యాలయ ఛాన్స్లర్స్లను ప్రభుత్వం తొలగించింది. టర్కీ న్యాయశాఖ మంత్రి బెకిర్ తెలిపిన వివరాల ప్రకారం...ఈనెల10 నాటికి 3,456 మంది న్యాయమూర్తులు, ప్రాసిక్యూటర్లను ప్రభుత్వం తొలగించింది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







