రష్యా వైమానిక దాడుల్లో ముగ్గురు అల్ఖైదా కమాండర్స్ హతమయ్యారు
- November 18, 2016
రష్యా భద్రతా బలగాలు జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు అల్ఖైదా ఉగ్రసంస్థ కీలక కమాండర్స్ హతమయ్యారు. ఈ విషయాన్ని రష్యా రక్షణశాఖ అధికార ప్రతినిధి ఐగర్ కోనషెంకేవ్ ధ్రువీకరించారు. అలెప్పోలో భారీ విధ్వంసాలకు పాల్పడేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు వైమానిక దాడులు నిర్వహించామని చెప్పారు. గురువారం ఇద్లిబ్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని అడ్మైరల్ కుజ్నేత్సోవ్ వైమానిక స్థావరం నుంచి ఎస్యూ-33 యుద్ధవిమానంతో దాడులు నిర్వహించినట్టు తెలిపారు. ఈ దాడుల్లో ఐఎస్ కమాండర్స్ మొహ్మద్ హెలాలా, అబూ జాబెర్ హర్మూజా, అబుల్ బాహా అల్-సఫారీలతో మరో 30 మంది ఉగ్రవాదులు కూడా మృతిచెందినట్టు కోనషెంకేవ్ చెప్పారు.ఇదిలా ఉండగా, ఇద్లిబ్, హామ్స్ నగరాల్లో ఇటీవలి కాలంలో ఐఎస్ కార్యకలాపాలు శృతిమించాయి. తాజాగా ఆత్మాహుతి దాడులకు పాల్పడి మారణహోమం సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను రష్యా బలగాలు భగం చేశాయి.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







