రష్యా వైమానిక దాడుల్లో ముగ్గురు అల్ఖైదా కమాండర్స్ హతమయ్యారు
- November 18, 2016
రష్యా భద్రతా బలగాలు జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు అల్ఖైదా ఉగ్రసంస్థ కీలక కమాండర్స్ హతమయ్యారు. ఈ విషయాన్ని రష్యా రక్షణశాఖ అధికార ప్రతినిధి ఐగర్ కోనషెంకేవ్ ధ్రువీకరించారు. అలెప్పోలో భారీ విధ్వంసాలకు పాల్పడేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు వైమానిక దాడులు నిర్వహించామని చెప్పారు. గురువారం ఇద్లిబ్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని అడ్మైరల్ కుజ్నేత్సోవ్ వైమానిక స్థావరం నుంచి ఎస్యూ-33 యుద్ధవిమానంతో దాడులు నిర్వహించినట్టు తెలిపారు. ఈ దాడుల్లో ఐఎస్ కమాండర్స్ మొహ్మద్ హెలాలా, అబూ జాబెర్ హర్మూజా, అబుల్ బాహా అల్-సఫారీలతో మరో 30 మంది ఉగ్రవాదులు కూడా మృతిచెందినట్టు కోనషెంకేవ్ చెప్పారు.ఇదిలా ఉండగా, ఇద్లిబ్, హామ్స్ నగరాల్లో ఇటీవలి కాలంలో ఐఎస్ కార్యకలాపాలు శృతిమించాయి. తాజాగా ఆత్మాహుతి దాడులకు పాల్పడి మారణహోమం సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను రష్యా బలగాలు భగం చేశాయి.
తాజా వార్తలు
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!









