డేటావిండ్ పరిశ్రమను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- November 18, 2016
సీఎం కేసీఆర్ విధానాల వల్ల తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని .. రాష్ట్ర పారిశ్రామిక విధానం పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే మైక్రోమ్యాక్స్, సెల్కాన్ మొబైల్ కంపెనీలు తమ తయారీ కేంద్రాలను ప్రారంభించగా డేటావిండ్ కంపెనీ సైతం ఉత్పత్తి ప్రారంభించిందన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డేటావిండ్ ఏర్పాటు చేసిన మొబైల్, ట్యాబ్లెట్ తయారీ పరిశ్రమను కెనడా రాయబారి నాదిర్పటేల్తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా డేటావిండ్ పరిశ్రమను ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు.ఇప్పటికే 600 మందికి ఉపాధి లభించిందని.. త్వరలో ఈ సంఖ్య రెట్టింపవుతుందన్నారు. ఏకగవాక్ష విధానం ద్వారా పెట్టుబడి దారులకు 15 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







