డేటావిండ్‌ పరిశ్రమను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

- November 18, 2016 , by Maagulf
డేటావిండ్‌ పరిశ్రమను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

సీఎం కేసీఆర్‌ విధానాల వల్ల తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని .. రాష్ట్ర పారిశ్రామిక విధానం పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇప్పటికే మైక్రోమ్యాక్స్‌, సెల్‌కాన్‌ మొబైల్‌ కంపెనీలు తమ తయారీ కేంద్రాలను ప్రారంభించగా డేటావిండ్‌ కంపెనీ సైతం ఉత్పత్తి ప్రారంభించిందన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డేటావిండ్‌ ఏర్పాటు చేసిన మొబైల్‌, ట్యాబ్‌లెట్‌ తయారీ పరిశ్రమను కెనడా రాయబారి నాదిర్‌పటేల్‌తో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా డేటావిండ్‌ పరిశ్రమను ఏర్పాటు చేసినట్లు కేటీఆర్‌ తెలిపారు.ఇప్పటికే 600 మందికి ఉపాధి లభించిందని.. త్వరలో ఈ సంఖ్య రెట్టింపవుతుందన్నారు. ఏకగవాక్ష విధానం ద్వారా పెట్టుబడి దారులకు 15 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com