డేటావిండ్ పరిశ్రమను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- November 18, 2016
సీఎం కేసీఆర్ విధానాల వల్ల తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని .. రాష్ట్ర పారిశ్రామిక విధానం పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే మైక్రోమ్యాక్స్, సెల్కాన్ మొబైల్ కంపెనీలు తమ తయారీ కేంద్రాలను ప్రారంభించగా డేటావిండ్ కంపెనీ సైతం ఉత్పత్తి ప్రారంభించిందన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డేటావిండ్ ఏర్పాటు చేసిన మొబైల్, ట్యాబ్లెట్ తయారీ పరిశ్రమను కెనడా రాయబారి నాదిర్పటేల్తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా డేటావిండ్ పరిశ్రమను ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు.ఇప్పటికే 600 మందికి ఉపాధి లభించిందని.. త్వరలో ఈ సంఖ్య రెట్టింపవుతుందన్నారు. ఏకగవాక్ష విధానం ద్వారా పెట్టుబడి దారులకు 15 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.
తాజా వార్తలు
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!









