డేటావిండ్ పరిశ్రమను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- November 18, 2016
సీఎం కేసీఆర్ విధానాల వల్ల తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని .. రాష్ట్ర పారిశ్రామిక విధానం పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే మైక్రోమ్యాక్స్, సెల్కాన్ మొబైల్ కంపెనీలు తమ తయారీ కేంద్రాలను ప్రారంభించగా డేటావిండ్ కంపెనీ సైతం ఉత్పత్తి ప్రారంభించిందన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డేటావిండ్ ఏర్పాటు చేసిన మొబైల్, ట్యాబ్లెట్ తయారీ పరిశ్రమను కెనడా రాయబారి నాదిర్పటేల్తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా డేటావిండ్ పరిశ్రమను ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు.ఇప్పటికే 600 మందికి ఉపాధి లభించిందని.. త్వరలో ఈ సంఖ్య రెట్టింపవుతుందన్నారు. ఏకగవాక్ష విధానం ద్వారా పెట్టుబడి దారులకు 15 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









