చైనా సూపర్ సిరీస్ ను కైవసం చేసుకున్న పీవీ సింధు
- November 20, 2016
తెలుగుతేజం.. ఒలింపిక్స్ రజత పతక విజేత వీపీ సింధు మరో ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక చైనా సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నీని సాధించి చరిత్ర సృష్టించింది. తుదిపోరులో తన కంటే ఒక ర్యాంకు(10) మెరుగైన చైనా క్రీడాకారిణి సన్ యూపై 21-11, 17-21, 21-11 తేడాతో సింధు సంచలన విజయం సాధించి టైటిల్ను ఎగరేసుకుపోయింది. తొలి రౌండ్ను సునాయాసంగా దక్కించుకున్న సింధుకు రెండో రౌండ్లో గట్టిపోటీ ఎదురైంది. దీంతో రెండో రౌండ్ను 17-21తేడాతో కోల్పోయింది. నిర్ణయాత్మకమైన మూడో రౌండ్లో సింధు అద్భుత పోరాట పటిమ ప్రదర్శించింది. ఎదురుదాడి చేస్తూ చైనా క్రీడాకారిణిని ఒత్తిడిలో పడేసింది. ఈ క్రమంలో 21-11 తేడాతో మూడో రౌండ్ గెలుసుకుని.. టైటిల్ చేజిక్కించుకుంది. సింధుకు కెరీర్లో ఇదే తొలి సూపర్ సిరీస్ కావడం విశేషం.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









