స్వదేశీ పృథ్వీ-2 క్షిప ణుల ప్రయోగం విజయవంతం...

- November 21, 2016 , by Maagulf
స్వదేశీ పృథ్వీ-2 క్షిప ణుల ప్రయోగం విజయవంతం...

స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రెండు స్వదేశీ పృథ్వీ-2 క్షిపణులను డీఆర్‌డీవో సోమవారం విజయవంతంగా పరీక్షించింది. అణ్వాయుధ సామర్థ్యంకలిగిన ఈ క్షిపణులను ఒడిసాలోని చాందీపూర్‌లో పరీక్షించారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణులు 350 కిలోమీట ర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. వీటిని 500కిలోల నుంచి వెయ్యి కిలోల బరువున్న అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యంతో తయారుచేశారు. ఐటీఆర్‌లో ని కాంప్లెక్స్‌-3 నుంచి మొబైల్‌ లాంచర్‌ ద్వారా ఒకదాని వెంట మరొకటి చొప్పున వీటిని ప్రయోగించినట్లు రక్షణశాఖ వర్గా లు వెల్లడించాయి. కాగా, 2009లోనూ ఇదేతరహాలో రెండు క్షిపణులను వెంటవెంటనే ప్రయోగించి పరీక్షించిన విషయం తెలిసిందే!

ట్విన్‌ ఇంజన్ల ద్వారా పనిచేసే ఈ క్షిపణులలో లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రత్యేకంగా అడ్వాన్స్‌డ్‌ ఇనర్షియల్‌ గైడెన్స్‌ వ్యవస్థను పొందుపరిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com