రూ.135 పెరిగిన బంగారం ధర....

- November 21, 2016 , by Maagulf
రూ.135 పెరిగిన బంగారం ధర....

 దేశీయంగా బంగారం మార్కెట్లు రికవరీ బాట పట్టాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు, జువెలరీ స్టాకిస్టుల నుంచి డిమాండ్‌ పెరగటంతో సోమవారం నాడు ముంబై బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. మరోవైపు పారిశ్రామిక రంగం నుంచి వెండికి డిమాండ్‌ పెరగటంతో ధరలు స్వల్పంగా పెరిగాయి. ముంబై బులియన్‌ మార్కెట్లో 24 క్యారట్ల (99.9 శాతం స్వచ్ఛత) పది గ్రాముల బంగారం ధరలు 135 రూపాయలు వృద్ధి చెంది 29,445 రూపాయల వద్ద స్థిరపడింది. మరోవైపు పది గ్రాముల ఆర్నమెంట్‌ బంగా రం (99.5 శాతం స్వచ్ఛత) ధరలు కూడా అదే స్థాయిలో పెరిగి 29,295 రూపాయల వద్ద క్లోజైంది.

కాగా కిలో వెండి ధర 35 రూపాయలు లాభపడి 41,800 రూపాయల వద్ద ముగిసింది. యూరోపియ నెలల కనిష్ఠ స్థాయి నుంచి పెరగటంతో దేశీయంగా బం గారం ధరలు పెరిగేందుకు దోహదపడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com