ఇకపై అంత్యక్రియలు లైవ్లో...!
- November 22, 2016
అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు శ్మశానవాటికలకు కూడా చేరువైంది. మరణించిన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చే బంధుమిత్రులకు శ్మశానవాటిక ఉన్న ప్రాంతం గురించి, అంత్యక్రియల గురించి సమాచారం అందించాలన్నా, ఎవరైనా విదేశాల్లో ఉండి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాలేకపోయినా వారికి లైవ్లో అంత్యక్రియల కార్యక్రమం చూసేలా ప్రత్యక్షప్రసారం చేసేందుకు వీలుగా శ్మశానవాటికలో మొట్టమొదటిసారి వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇంతకీ ఇలాంటి శ్మశానం ఎక్కడుందనే కదా మీ సందేహం.తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగర శివారు ప్రాంతమైన వేలగంపాడు శ్మశానవాటికలో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఈ శ్మశానవాటిక నిర్వహణ బాధ్యతలను ఇండియన్ కమ్యూనిటీ వెల్పేర్ ఆర్గనైజేషన్కు చెన్నై నగర పాలక సంస్థ అప్పగించింది.దీంతో ఈ సంస్థ ఇక్కడ వైఫై సేవలు అందుబాటులోకి తెచ్చింది. శ్మశానవాటికలో వైఫై సౌకర్యం ఏర్పాటు వల్ల తమకు ఆదరణ పెరిగిందని సంఘం వ్యవస్థాపక కార్యదర్శి హరిహరన్ అంటున్నారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









