ఖరారైన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శీతాకాల విడిది

- November 22, 2016 , by Maagulf
ఖరారైన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శీతాకాల విడిది

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శీతాకాల విడిది ఖరారైంది. డిసెంబర్ 22 నుంచి 31వ తేదీ వరకు ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉంటారు. శీతాకాల విడిదిలో భాగంగా వారం రోజుల పాటు బొల్లారంలో బస చేయనున్నారు. ఈ విడిదిలో ఒక రోజు తిరువనంతపురం, మైసూరులో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మేరకు ప్రణబ్ పర్యటన షెడ్యూల్‌ను రాష్ట్రపతి భవన్ ఖరారు చేసింది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర యంత్రాంగాన్ని ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com