రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు
- November 22, 2016
రోడ్డు ప్రమాదంలో విజిబిలిటీ కారణంగా 25 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. అబుదాబీ పోలీస్ జనరల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ అలి ఖల్ఫాన్ అల్ ధాధెరి వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రమాదంలో గాయపడ్డవారిని తవామ్ హాస్పిటల్కి తరలించారు. ప్రమాద ఘటన గురించి సమాచారం అందించిన వెంటనే, ఘటనా స్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాల్ని ముమ్మరం చేశామని ఆయన తెలిపారు. అక్కడికక్కడే క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేసి, ఆ తర్వాత పరిస్థితి విషమంగా ఉన్నవారిని అల్ అయిన్లోని తవామ్ ఆసుపత్రికి తరలించారు. లో విజిబిలిటీ కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించకపోవడంతో పలు వాహనాలు ప్రమాదాలకు గురయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వాహనదారులు పరిస్థితులకు అనుగుణంగా వాహనాల్ని నడపాల్సి ఉంటుందనీ, లో విజిబిలిటీ ఉన్నప్పుడు తక్కువ వేగంతో ప్రయాణించాలనీ, తగిన సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని, ముందు వెళ్ళే వాహనానికి తగినంత దూరం పాటించాలని పోలీసు అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన వైశాలి: వరల్డ్ టైటిల్ రేసులో భారత యువ కెరటం!
- ప్రాంతీయ స్థిరత్వంపై సౌదీ క్రౌన్ ప్రిన్స్–పాకిస్థాన్ ప్రధాని కీలక భేటీ
- ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్ స్థిరత్వం పై ఖతార్ అమీర్–అమెరికా అధ్యక్షుడు ఫోన్ చర్చ
- ఇరాన్కు రోజుకు రూ.4 వేల కోట్ల నష్టం
- సౌదీ ట్రాన్సిట్ వీసా ఫెసిలిటీ సస్పెండ్: ఇండియన్ ఎంబసీ
- ఉద్రిక్తతల తగ్గింపు, ఇంధన స్థిరత్వంపై అమీర్, ట్రంప్ చర్చలు..!!
- పిల్లల ఇ-స్కూటర్ దుర్వినియోగానికి తల్లిదండ్రులే బాధ్యులా?
- సౌదీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం..లిబియా పై కీలక నిర్ణయం..!!
- వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డే: శుక్రవారం ఉచిత బస్ రైడ్స్..!!









