జపాన్ భూప్రకంపనలతో వణికిపోతోంది
- November 23, 2016
జపాన్ భూప్రకంపనలతో వణికిపోతోంది. రెండు రోజుల క్రితం భారీ భూకంపంతో తల్లడిల్లిన జపాన్ ఈ రోజు తెల్లవారుజామున మరోసారి చిగురుటాకులా వణికింది. జపాన్లోని ఫుకుషిమాలో తెల్లవారుజామున 2.53 నిమిషాలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.6గా భూకంప తీవ్రత నమోదైంది. ఇవాకికి 42 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. ఫుకుషిమాలో అణు విద్యుత్ కేంద్రం సమీపంలో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏ నిమిషం ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సునామీలు, భూకంపాల నుంచి జపాన్కు పెను ప్రమాదం పొంచి ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







