రోడ్డు ప్రమాదం: మెడికల్‌ అబ్జర్వేషన్‌లో బాధితుడు

- November 23, 2016 , by Maagulf
రోడ్డు ప్రమాదం: మెడికల్‌ అబ్జర్వేషన్‌లో బాధితుడు

మస్కట్‌: రోడ్డు ప్రమాదంలో తన తల్లిని, తన భర్తనీ కోల్పోయిన మైమూత్‌ అమీర్‌ అనే మహిళకు, ఇంకా ఆ ఘటనతో చనిపోయినవారి వివరాల్ని తెలియజేయలేదు. ప్రస్తుతం ఆమె ఇంకా షాక్‌లో ఉన్నారనీ, అందుకే ఆమెను పూర్తిస్థాయిలో అబ్జర్వేషన్‌లో ఉంచామని వైద్యులు వెల్లడించారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా జరిగిన ప్రమాదం గురించి బాధితురాలికి ఇంకా చెప్పలేదు. భర్త, తల్లితో కలిసి కారులో వెళుతున్న మైమూత్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. వీరు ప్రయాణిస్తున్న కారు మరో కారుని ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో మిగతా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మైమూత్‌ ముగ్గురు పిల్లలు గాయాలతో బయటపడ్డారు. ఆ ముగ్గురూ అల్‌ ఖౌద్‌ సుల్తాన్‌ కబూస్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఐదేళ్ళ ఫాతిమాకి సర్జరీ జరిగింది. మిగతా ఇద్దరికి మాత్రం చిన్న గాయాలే అయ్యాయి. వరుసగా సెలవులు రావడంతో, మృతదేహాల్ని పంపించేందుకు ఏర్పాట్లు చేయలేకపోతున్నట్లు మృతుల బంధువులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com