నేడు మోదీ హైదరాబాద్ రాక ....
- November 24, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం నగరానికి రానున్నారు. సాయంత్రం ఆరు గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు కేంద్రమంత్రులు, అధికారులు ప్రత్యేక విమానంలో రానున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీకి చేరుకుంటారని అధికారులు తెలిపారు. విమానాశ్రయం, కిషన్గూడ, కామంచెర్వు, మధురా నగర్, ఆర్బీనగర్, కొత్వాల్గూడ చౌరస్తా, భారతచౌరస్తా, సాతం రాయి, గగన్పహాడ్, ఓల్డ్ కర్నూల్ చౌరస్తా గుండా ఎన్పీఏ వరకు హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ వస్తున్నారు. ఆయన రోడ్డుమార్గంలో శివరాంపల్లిలోని సర్ధార్ వల్లభాయ్పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్పీఏ)కి వెళతారని అధికార వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









