నగదు అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని విమానాశ్రయాల్లో భద్రత

- November 24, 2016 , by Maagulf
నగదు అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని విమానాశ్రయాల్లో భద్రత

నోట్ల రద్దు నేపథ్యంలో నగదు అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశించింది. నాగాలాండ్‌లోని దిమాపూర్‌ విమానాశ్రయంలో ఓ వ్యాపారి రూ.3.5 కోట్ల నగదుతో పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే అది సక్రమ ఆదాయమే అని భావించి ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం అధికారులు అతణ్ని విడిచిపెట్టారు. నిఘా విభాగం అప్రమత్తం చేయడంతో తర్వాత జరిపిన గాలింపుల్లో సదరు నగదుతోపాటు పాత నోట్ల రూపంలో మరో రూ.4.47కోట్లు కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com