సమ్మె కారణంగా లుఫ్తాన్స విమానాలను నిలిపివేసింది.
- November 25, 2016
జర్మనీ ఫ్లాగ్ షిప్ ఎయిర్ లైన్ లుఫ్తాన్స దాదాపు 830 దేశీయ, యూరోపియన్ విమానాలను శుక్రవారం నిలిపివేసింది. దీంతో 1,00,000 మంది ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపింది. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ పైలెట్లు చేస్తున్న సమ్మె కారణంగా విమానాలను నిలిపివేస్తున్నట్టు ఎయిర్ లైన్ ప్రకటించింది. పైలెట్లు సమ్మె నేటికి మూడో రోజుకు చేరుకుంది. వారు సమ్మెకు దిగినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 2600 విమానాలను ఆ ఎయిర్ లైన్ రద్దుచేసింది. పైలెట్లు చేస్తున్న ఈ సమ్మె శనివారం వరకు పొడిగించనున్నట్టు పైలెట్ల యూనియన్ గురువారం ప్రకటించింది.2014 ఏప్రిల్ నుంచి లుఫ్తాన్స లో ఈ సమ్మె జరగడం 14వ సారి. ప్రతేడాది 3.66 శాతం వేతనాలను పెంచాలని అప్పటినుంచి పైలెట్ల యూనియన్ డిమాండ్ చేస్తోంది.అయితే మేనేజ్ మెంట్ కేవలం 2.5 శాతం మాత్రమే ఆఫర్ చేస్తోంది. ఆస్ట్రేలియన్ ఎయిర్ లైన్సు, స్విస్ రెండు కూడా లుఫ్తాన్స లో భాగం. జర్మనీకి వారి సేవలు విస్తరిస్తున్న క్రమంలో పైలెట్లు ఈ సమ్మెకు దిగారు. అయితే గ్రూప్ కు చెందిన ఇతర విమానయాన సంస్థలు జర్మన్ వింగ్స్, ఎయిర్ డోలోమిటి, బ్రూసిల్స్ ఎయిర్ లైన్సు ఈ సమ్మెకు ప్రభావితం కాలేదు.లుఫ్తాన్సలో జరుగుతున్న ఈ సమ్మెతో రోజుకు ఆ గ్రూప్ 10 మిలియన్ యూరోలు(రూ.72కోట్లు) కోల్పోనుందని టాప్ సెల్లింగ్ డైలీ బిల్డ్ రిపోర్టుచేసింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









