రిటైర్డ్‌ కండక్టర్‌ ధనుష్‌ కోసం కోర్టును ఆశ్రయించారు..

- November 26, 2016 , by Maagulf
రిటైర్డ్‌ కండక్టర్‌ ధనుష్‌ కోసం కోర్టును ఆశ్రయించారు..

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ అల్లుడు ధనుష్‌ మా కుమారుడంటే.. కాదు మాకే పుట్టాడంటూ రెండు జంటల మధ్య సరికొత్త వివాదం మొదలైంది. మదురై జిల్లా మల్లంపట్టికి చెందిన ఆర్‌టీసీ రిటైర్డ్‌ కండక్టర్‌ కదిరేశన్(60), మీనాక్షి(58) దంపతులు ధనుష్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. వీరి అభ్యర్థనను స్వీకరించిన మేలూరు కోర్టు జనవరి 12న నేరుగా హాజరు కావాలంటూ ధను్‌షకు సమన్లు జారీ చేసింది. వివరాలు.. కదిరేశన్ దంపతుల పిటిషన మేరకు.. ధనుష్‌ 7.11.1985లో జన్మించారు.అసలు పేరు కలైసెల్వన్. తిరుపత్తూరు ప్రభుత్వ కళాశాలలో 11వ తరగతి చదువుతూ.. ఇంటి నుంచి పారిపోయా డు. అనంతరం, దర్శకుడు కస్తూరి రాజా వద్ద పనిలో చేరి, నటుడిగా ఎదిగాడు.అతన్ని కలుసుకునేందుకు కదిరేశన దంపతులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వృద్ధులైన తమకు అనారోగ్య సమస్యలున్నాయని, అందువల్ల ధనుష్‌ నుంచి నెలకు రూ.65 వేల పరిహారం ఇప్పించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఇదిలావుంటే, దనుష్‌ తమ కన్న కొడుకని దర్శకుడు కస్తూరి రాజా వ్యాఖ్యానించారు.ఈ వివాదం తమకు ఎంతో ఆవేదన కలిగిస్తోందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com