రిటైర్డ్ కండక్టర్ ధనుష్ కోసం కోర్టును ఆశ్రయించారు..
- November 26, 2016
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ మా కుమారుడంటే.. కాదు మాకే పుట్టాడంటూ రెండు జంటల మధ్య సరికొత్త వివాదం మొదలైంది. మదురై జిల్లా మల్లంపట్టికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ కండక్టర్ కదిరేశన్(60), మీనాక్షి(58) దంపతులు ధనుష్ కోసం కోర్టును ఆశ్రయించారు. వీరి అభ్యర్థనను స్వీకరించిన మేలూరు కోర్టు జనవరి 12న నేరుగా హాజరు కావాలంటూ ధను్షకు సమన్లు జారీ చేసింది. వివరాలు.. కదిరేశన్ దంపతుల పిటిషన మేరకు.. ధనుష్ 7.11.1985లో జన్మించారు.అసలు పేరు కలైసెల్వన్. తిరుపత్తూరు ప్రభుత్వ కళాశాలలో 11వ తరగతి చదువుతూ.. ఇంటి నుంచి పారిపోయా డు. అనంతరం, దర్శకుడు కస్తూరి రాజా వద్ద పనిలో చేరి, నటుడిగా ఎదిగాడు.అతన్ని కలుసుకునేందుకు కదిరేశన దంపతులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వృద్ధులైన తమకు అనారోగ్య సమస్యలున్నాయని, అందువల్ల ధనుష్ నుంచి నెలకు రూ.65 వేల పరిహారం ఇప్పించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఇదిలావుంటే, దనుష్ తమ కన్న కొడుకని దర్శకుడు కస్తూరి రాజా వ్యాఖ్యానించారు.ఈ వివాదం తమకు ఎంతో ఆవేదన కలిగిస్తోందన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







