అమితంగా ఆకట్టుకొంటున్న చిత్రం "జయమ్ము నిశ్చయమ్ము రా"..

- November 27, 2016 , by Maagulf
అమితంగా ఆకట్టుకొంటున్న చిత్రం

ఈనెల 25న విడుదలై ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకొంటున్న చిత్రం "జయమ్ము నిశ్చయమ్ము రా". శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దేశీవాళీ వినోదాన్ని పంచుతూ విజయపధంలో పయనిస్తోంది. విడుదలైన అన్నీ చోట్లా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ప్రదర్శితమవుతున్న ఈ చిత్ర హీరోహీరోయిన్లయిన శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ, చిత్ర దర్శకులు శివరాజ్ కనుమూరి, ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్ అధినేత నీలం కృష్ణారెడ్డి మరియు యూనిట్ సభ్యులు పాలుపంచుకొన్నారు. ఈ సందర్భంగా చిత్ర బృంద సభ్యులు ఆడియన్స్ తో ముచ్చటించి, సినిమాపై వారి అభిపాయాల్ని తెలుసుకొన్నారు. తమ చిత్రానికి ఘన విజయం అందించినందుకు ప్రేక్షకులకు కృతజ్నతలు తెలియజేశారు. అమీర్ పేట్ లోని సత్యం థియేటర్ నుంచి మొదలైన యూనిట్ అనంతరం మూసాపేటలోని లక్ష్మీ కళ, కూకట్ పల్లిలోని అర్జున్ థియేటర్లను సందర్శించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com