లింగమార్పిడి వ్యక్తులకు ఇండియన్ రైల్వే శుభవార్త
- November 27, 2016
లింగమార్పిడి(ట్రాన్స్జెండర్లు) చేయించుకున్న వ్యక్తులకు రైల్వే శుభవార్త చెప్పింది. టికెట్ రిజర్వేషన్, క్యాన్సిలేషన్ ఫామ్లలో వారిని 'థర్ట్ జెండర్'(మూడో లింగం)గా పరిగణిస్తూ ప్రత్యేకంగా ఓ కాలమ్ ఏర్పాటు చేసింది. రిజర్వేషన్ ఫామ్లలో ఈ కాలమ్ ఏర్పాటు చేయాలన్న ఢిల్లీకి చెందిన ఓ లాయర్ సూచన మేరకు రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే, ఐఆర్సీటీసీ తాజా నిర్ణయంతో అటు ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్లోనూ ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా ఓ కాలమ్ అందుబాటులోకి రానుంది. రైల్వే నిర్ణయంపై ట్రాన్స్జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదొక్కటే సరిపోదని చెబుతున్నారు. తమకోసం ప్రత్యేకంగా సీట్లు, ప్రత్యేక కోచ్లు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







