ఒమాన్లో అదిక ఉష్ణోగ్రతలు - పొడిగించాల్సిన మధ్యాహ్న విరామం
- September 01, 2015
ఒమాన్ లో ఇంకా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా వందల సంఖ్యలో శ్రామికులు ఆసుపత్రుల ముందు క్యూ లు కడుతున్న నేపధ్యంలో, మధ్యాహ్న విరామాన్ని మరికొంత కాలం పొడిగించాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ సంవత్సరం ఇంచుమించు 25 శాతం కేసులు అధికంగా నమోదయ్యాయని వైద్యులు చెపుతుండగా, ఈ అధిక ఉష్ణోగ్రతలు కనీసం ఈ నెల మధ్యవరకు ఐనా ఉంటాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. మధ్యాహ్నo 12.30 నుండి 3.30 వరకు ఉం డే ఈ మధ్యాహ్న విరామం, జూన్ 1 నుండి మొదలై, ఈ ఆదివారం ముగిసిన సంగతి తెలిసిందే! ఇది ఇలా ఉండగా, ఈ మండుటెండలో, చమురు క్షేత్రాల్లోనూ, ఇతర కర్మాగారాల్లోనూ పనిచేసే కార్మికుల గతి వర్ణనా తీ తమని, ఇంత తీవ్ర పరిస్థితిలో శ్రామికుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టరాదని, పెట్రో లియం డెవెలప్ మెంట్ ఒమాన్ ట్రేడ్ యూనియన్ మరియు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ యూనియన్స్ ఛైర్మన్ సౌడ్ సాల్మి, ఇంకా ఇతర యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.
--లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







