ఒమాన్లో అదిక ఉష్ణోగ్రతలు - పొడిగించాల్సిన మధ్యాహ్న విరామం
- September 01, 2015
ఒమాన్ లో ఇంకా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా వందల సంఖ్యలో శ్రామికులు ఆసుపత్రుల ముందు క్యూ లు కడుతున్న నేపధ్యంలో, మధ్యాహ్న విరామాన్ని మరికొంత కాలం పొడిగించాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ సంవత్సరం ఇంచుమించు 25 శాతం కేసులు అధికంగా నమోదయ్యాయని వైద్యులు చెపుతుండగా, ఈ అధిక ఉష్ణోగ్రతలు కనీసం ఈ నెల మధ్యవరకు ఐనా ఉంటాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. మధ్యాహ్నo 12.30 నుండి 3.30 వరకు ఉం డే ఈ మధ్యాహ్న విరామం, జూన్ 1 నుండి మొదలై, ఈ ఆదివారం ముగిసిన సంగతి తెలిసిందే! ఇది ఇలా ఉండగా, ఈ మండుటెండలో, చమురు క్షేత్రాల్లోనూ, ఇతర కర్మాగారాల్లోనూ పనిచేసే కార్మికుల గతి వర్ణనా తీ తమని, ఇంత తీవ్ర పరిస్థితిలో శ్రామికుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టరాదని, పెట్రో లియం డెవెలప్ మెంట్ ఒమాన్ ట్రేడ్ యూనియన్ మరియు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ యూనియన్స్ ఛైర్మన్ సౌడ్ సాల్మి, ఇంకా ఇతర యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.
--లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







