ఒమాన్లో అదిక ఉష్ణోగ్రతలు - పొడిగించాల్సిన మధ్యాహ్న విరామం

- September 01, 2015 , by Maagulf
ఒమాన్లో అదిక ఉష్ణోగ్రతలు - పొడిగించాల్సిన మధ్యాహ్న విరామం

ఒమాన్ లో ఇంకా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా వందల సంఖ్యలో శ్రామికులు ఆసుపత్రుల ముందు క్యూ లు కడుతున్న నేపధ్యంలో, మధ్యాహ్న విరామాన్ని మరికొంత కాలం పొడిగించాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ సంవత్సరం ఇంచుమించు 25 శాతం కేసులు అధికంగా నమోదయ్యాయని వైద్యులు చెపుతుండగా, ఈ అధిక ఉష్ణోగ్రతలు కనీసం ఈ నెల మధ్యవరకు ఐనా ఉంటాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. మధ్యాహ్నo 12.30 నుండి 3.30 వరకు ఉం డే ఈ మధ్యాహ్న విరామం, జూన్ 1 నుండి మొదలై,  ఈ ఆదివారం ముగిసిన సంగతి తెలిసిందే! ఇది ఇలా ఉండగా, ఈ మండుటెండలో, చమురు క్షేత్రాల్లోనూ, ఇతర కర్మాగారాల్లోనూ పనిచేసే కార్మికుల గతి వర్ణనా తీ తమని, ఇంత తీవ్ర పరిస్థితిలో శ్రామికుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టరాదని, పెట్రో లియం డెవెలప్ మెంట్ ఒమాన్ ట్రేడ్ యూనియన్ మరియు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ యూనియన్స్ ఛైర్మన్ సౌడ్ సాల్మి, ఇంకా ఇతర యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.

 

--లెనిన్ కుమార్(ఒమాన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com