"యు ఏ ఈ" లో 700 మంది శ్రామికులకు నాణ్యత గల దంత వైద్యం
- September 01, 2015
దుబాయ్ యువరాజు షేక్ హందాన్ బిన్ మొహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వారిచే మే 2015 లో ప్రారoభించబడిన ‘హందాన్ బిన్ మొహమ్మద్ ఓరల్ హైజీన్ ' పధకంలో ఇప్పటిదాకా ఇంచుమించు 700 మందికి శ్రామికులకు పరీక్షలు జరిపి, వారిలో 500 మందికి చికిత్సను సూచించారు. ఈ సంవత్సరాంతానికి పూర్తికానున్న మొదటిదశ లో 2000 మంది శ్రామికులకు దంతవైద్య సేవలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. భాగస్వాములతో పాటు, శ్రామికులకు కూడా ప్రయోజనం కలిగేలా, ఇన్సూరెన్స్ చే కవర్ చేయబడనిదయిన, ఖరీదైన దంతవైద్యాన్ని అందిస్తున్నామని యువరాజు కార్యాలయం యొక్క డైరక్టర్ జనరల్ సైఫ్ బిన్ మార్ఖన్ అల్ కెత్బి తెలిపారు. దుబాయి శ్రామిక వ్యవహారాల శాశ్వత కమిటీ అధ్యక్ష్యులైన మేజర్ జనరల్ ఒబైడ్ మొహైర్ బిన్ సురూర్ - సమాజంలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా, దంత సంరక్షణ యొక్క స్థాయిని కూడా పెంచాలని తాము ఆశిస్తున్నట్టు తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







