"యు ఏ ఈ" లో 700 మంది శ్రామికులకు నాణ్యత గల దంత వైద్యం
- September 01, 2015
దుబాయ్ యువరాజు షేక్ హందాన్ బిన్ మొహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వారిచే మే 2015 లో ప్రారoభించబడిన ‘హందాన్ బిన్ మొహమ్మద్ ఓరల్ హైజీన్ ' పధకంలో ఇప్పటిదాకా ఇంచుమించు 700 మందికి శ్రామికులకు పరీక్షలు జరిపి, వారిలో 500 మందికి చికిత్సను సూచించారు. ఈ సంవత్సరాంతానికి పూర్తికానున్న మొదటిదశ లో 2000 మంది శ్రామికులకు దంతవైద్య సేవలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. భాగస్వాములతో పాటు, శ్రామికులకు కూడా ప్రయోజనం కలిగేలా, ఇన్సూరెన్స్ చే కవర్ చేయబడనిదయిన, ఖరీదైన దంతవైద్యాన్ని అందిస్తున్నామని యువరాజు కార్యాలయం యొక్క డైరక్టర్ జనరల్ సైఫ్ బిన్ మార్ఖన్ అల్ కెత్బి తెలిపారు. దుబాయి శ్రామిక వ్యవహారాల శాశ్వత కమిటీ అధ్యక్ష్యులైన మేజర్ జనరల్ ఒబైడ్ మొహైర్ బిన్ సురూర్ - సమాజంలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా, దంత సంరక్షణ యొక్క స్థాయిని కూడా పెంచాలని తాము ఆశిస్తున్నట్టు తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









