వచ్చే ఏడాది దీపావళికి '2.0' విడుదల...
- November 29, 2016
ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో '2.0' అనే సినిమా తెరకెక్కుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా రోబోకి సీక్వెల్గా తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానున్న ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలున్నాయి. ఇక ఇప్పటికే 90%పైనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగతా పోర్షన్ జనవరికల్లా పూర్తవుతుందట.దీంతో జనవరి నెలాఖరు నుంచి అక్టోబర్ వరకూ సుమారు 8-9 నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్పైనే శంకర్ పనిచేయనున్నారు. ముఖ్యంగా ఈ సినిమా 3డీలో విడుదల కానుండడంతో అందుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. పలువురు టాప్ హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా విజువల్ ఎఫెక్ట్స్ కోసం పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







